సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందిన 'రథేరా'

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై ఎస్ కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది.

ఈ సందర్భంగా..

దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ - వి వి వినాయక్ గారు విడుదల చేసిన మా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ వారు సినిమా చూసి మంచి సినిమా అని మా యూనిట్ ని ప్రశంసించారు. మంచి కంటెంట్ తో తెరకెక్కుతున్న చిత్రం. అందరూ కొత్త వారికే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సంగీతం తో పాటు ఆర్ ఆర్ కి మంచి ప్రశంసలు వస్తున్నాయి. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - సెన్సార్ వారు మా చిత్రాన్ని అభినందించడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషన్స్ ప్రతి ఒక్కరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరకీ నచ్చుతుంది అన్నారు.

సిద్దు, మానస, మారుతి, సాకారం, కె టి వర్మ, సుగన్, బ్యాంక్ శ్రీను, రమాదేవి, నాగమల్లయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి...