రవితేజ చిత్రానికి మంచి డీల్ కుదిరింది

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

రాజా ది గ్రేట్' విజయంతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు మాస్ మహారాజా రవితేజ. అయితే ఇటీవల కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ రూపొందించిన టచ్ చేసి చూడు' మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇదిలా వుంటే...ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రవితేజ. వినోదమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఆస‌క్తికరమైన విషయమొకటి.. టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే....తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులతో పాటు హిందీ హక్కుల్ని కూడా సుమారు 25 కోట్ల రూపాయలకి అమ్మేశారట. దీంతో ఈ సినిమా విషయంలో నిర్మాత రామ్ తాళ్ళూరి చాలా వ‌ర‌కు సేఫ్ జోన్ లోకి వచ్చేసారని కథనాలు వినపడుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన‌ సోగ్గాడే చిన్ని నాయనా', రా రండోయ్ వేడుక చూద్దాం' చిత్రాలు విజయం సాధించడమే.. నేల టికెట్' సినిమా బిజినెస్‌కు బాగా కలిసొచ్చిందని ట్రేడ్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

More News

'సవ్యసాచి' రిలీజ్ డేట్

'ప్రేమమ్' వంటి హిట్ చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య,యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో

శ్రీదేవిపై ఐదు భాగాలుగా డాక్యుమెంటరీ

ఇటీవల బాలీవుడ్ లో 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వచ్చింది.

థియేటర్ లో మహేష్ పోరాటాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’.

భానుమతి పాత్రలో అనుష్క....

టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న అనుష్క..

బాలీవుడ్ రీమేక్ లో జ్యోతిక...

హీరో సూర్య ను పెళ్లి చేసుకుని సినిమాల నుండి తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడుసినిమాల్లో నటిస్తుంది.