డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల

  • IndiaGlitz, [Friday,January 17 2020]

మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఫేమ్‌ నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌ లు తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాలోని మూడో పాట హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో వి.ఐ. ఆనంద్, సునీల్, నభ నటేష్, తమన్ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ....డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.
 
 
తమన్ మాట్లాడుతూ.... రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.
 
సునీల్ మాట్లాడుతూ... రవితేజ గారితో నేను కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ఇది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనంద్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశాడు, ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ మూవీలా ఉంటుంది అన్నారు.
 
నభ నటేష్ మాట్లాడుతూ... రవితేజ గారితో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి, ఈ సినిమాలో నా పాత్ర పేరు నభ, మీ అందరికి నచ్చుతుంది. ఢిల్లీ వాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న డిస్కో రాజా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరారు.

More News

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త!

ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త ఒకటి సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి పండుగకు కొనసాగింపు అన్నట్టుగా.. తన 20వ చిత్రానికి సంబంధించిన తాజా

దీపిక స్టింగ్ ఆపరేషన్.. ఉలిక్కిపడ్డ అధికారులు!

స్టింగ్ ఆపరేషన్స్.. ఈ పేరు వింటే రాజకీయ నాయకులు ఉలిక్కిపడతారు. వీటిని పాత్రికేయలోకం ఎక్కువగా నిర్వహిస్తుంటుంది. సమాజంలో అవినీతిని వెలికి తీయడానికి..

పదేళ్ల కల నెరవేరింది.. కంగనా స్టూడియో రెడీ!

కంగనా రనౌత్.. పట్టుదలకు మారుపేరుగా.. బాలీవుడ్ క్వీన్‌గా తనకంటూ ప్రత్యేక సొంతం చేసుకున్న నటి. విభిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పట్టు పట్టిందంటే.. నెగ్గేవరకు వదలదన్నది ఆమెకున్న పేరు.

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. 2019-20 కాంట్రాక్ట్ జాబితాలో ధోనీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు.

రైతులారా బాబును నమ్మొద్దు... మీకు న్యాయం చేసేది జగనే : తలసాని

ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏలూరు లో కోడి పందేలను చూసేందుకు వెళ్ళిన ఆయన...