close
Choose your channels

NTR : అన్నగారి అభిమానులకు గుడ్ ‌న్యూస్.. రూ.100 నాణేంపై ఎన్టీఆర్ బొమ్మ, త్వరలోనే విడుదల

Friday, June 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ప్రభుత్వ పరంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదని ప్రతి తెలుగు వాడు భావిస్తాడు. సినీనటుడిగా, పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆయన సమాజానికి, దేశానికి ఎంతో సేవ చేశారని.. అలాంటి వ్యక్తికి నేటికీ భారతరత్న దక్కకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వున్నారు. పలుమార్లు దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేయడం అక్కడి నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడం దశాబ్ధాలుగా జరుగుతూనే వుంది. ప్రస్తుతం అన్నగారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలకు ఆర్‌బీఐ ఓకే:

ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించినట్లుగా ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. గురువారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో వున్న రూ.100 నాణెం చలామణిలోకి వచ్చే అవకాశం వుందన్నారు. రూ.వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని .. త్వరలోనే 100 రూపాయల ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని పురంధేశ్వరి తెలిపారు.

తిరుపతి అంటే ఎంతో ఇష్టం:

తిరుపతి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమని.. రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ఆయన ప్రారంభించారని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని పురంధేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ శత జయంతి వేడుకలల్లో పాల్గొనాలని ఆమె కోరారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.