ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రియ‌ల్ డిప్యూటీ స్పీక‌ర్‌...?

  • IndiaGlitz, [Thursday,October 04 2018]

స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ య‌న్‌.టి.ఆర్‌ను రీసెంట్‌గా 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'గా మార్చారు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ డైరెక్ష‌న్‌లో సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ సినిమాలో రానా, సుమంత్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, జిస్సేన్ గుప్తా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. కాగా.. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ఆంధ్ర ప్ర‌దేశ్ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ న‌టించ‌నున్నారట‌. దివిసీమ గాంధీ, మాజీ మంత్రి మండ‌లి కృష్ణారావు.. మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ తండ్రి.

దివిసీమ ఉప్పెన వ‌చ్చిన స‌మయంలో మండ‌లి కృష్ణారావు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌జ‌ల‌కు సేవ చేశారు. బ‌యోపిక్‌లో ఆయ‌న పాత్ర‌ను ఆయ‌న కొడుకు మండ‌లి బుద్ధ‌ప్ర‌సాదే చేస్తే.. బావుంటుంద‌ని బాల‌కృష్ణ‌, క్రిష్ భావించి ఆయ‌న్ను సంప్ర‌దించార‌ట‌. ఆయ‌న వైపు నుండి ఎలాంటి రిప్లై ఇంకా రాలేద‌ని స‌మాచారం.

More News

'య‌న్‌.టి.ఆర్' టైటిల్ మారింది...

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' బయోపిక్‌గా .. రెండు భాగాలుగా తెరెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలోకి వ‌ర్మ సినిమా...

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'భైర‌వ గీత‌'.  రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ రా ల‌వ్‌స్టోరీగా సినిమా రూపొందుతుంది.

విప్ల‌వ నాయ‌కుడి పాత్ర‌లో...

త‌మిళుల హ‌క్కుల కోసం ప‌రాయి దేశ‌మైనా శ్రీలంక‌లో పోరాడిన వ్య‌క్తి వేలు పిళ్లై ప్ర‌భాక‌రన్‌. ఎల్‌.టి.ఇ.ఇ అనే అతివాద సంస్థ‌ను స్థాపించి కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా హ‌త‌మార్చారు.

క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత ..

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత రైజింగ్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ అంట‌నే ఇష్టమంటున్న క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌.

వ్యాపార రంగంలోకి ప్రియాంక‌చోప్రా...

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లి అక్క‌డ కూడా న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో్యిన్ ప్రియాంక చోప్రా.. త‌ర్వ‌లోనే త‌న ప్రియుడు .. ప్ర‌ముఖ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకోనుంది.