చాయ్‌వాలాగా మారిన దీదీ.. ఎందుకిలా!?

  • IndiaGlitz, [Thursday,August 22 2019]

ఇదేంటి చాయ్‌వాలా అంటే టక్కున గుర్తొచ్చేది నరేంద్ర మోదీ కదా..? దీదీ అంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాయ్‌వాలాగా మారిపోయారు.. ఎందుకిలా అని అడిగితే పెద్ద కథే చెప్పుకొచ్చారండోయ్! ఆమె ఎందుకిలా మారారో..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

దీదీ సరదా!
రోజు మాదిరిగానే కార్యక్రమాలను ముగించుకున్న దీదీ.. దిఘాలోని దత్తాపూర్ గ్రామంలో కొద్దిసేపు ఆగి అక్కడి ప్రజలతో ముచ్చటించి అనంతరం ఓ టీ స్టాల్‌కు వెళ్లారు. అలసిపోయిన ఆమెకు టీ తాగాలి అనిపించిందేమో కానీ.. స్వయంగా టీ తయారు చేసిన ఆమె తాగి.. అనంతరం సహచరులకు కూడా అందజేశారు దీదీ. అంతేకాదు.. అసలు టీ తయారిలో ఏమేం వాడుతారంటూ.. టీ కొట్టు యజమానిని అడిగి మరీ తెలుసుకున్న ఆమే స్వయంగా తయారు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. అంతేకాదండోయ్.. కిచెన్‌లో వంట చేయడం దీదీ చాలా సరదా అంట. అయితే పొలిటికల్ ఎంగేజ్ మెంట్స్‌తో మిస్సవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేసిన మమతా బెనర్జీ.. ఆ చిన్నారి తల్లికి కప్ కేక్ తాగించారు. ఈ విషయాలను తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు దీదీ.

దీదీ ఆసక్తికర ట్వీట్..
ఒక్కోసారి జీవితంలో మనం చేసే చిన్నపాటి సంతోషాలే.. చిన్న పనులే మనల్ని ఎంతో ఆనంద పరవశుల్ని చేస్తుంటాయి. వీటిలో రుచికరమైన ‘టీ’ తయారు చేయడం కూడా ఒకటి. దత్తాపూర్ లోని దిఘాలో నేనిదే చేశాను’ అని దీదీ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈమె ట్వీట్‌కు పలువురు కార్యకర్తలు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

'కౌసల్య కృష్ణమూర్తి' లాంటి మంచి సినిమాతో తెలుగులో పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది - ఐశ్వర్య రాజేష్

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

టీమిండియా క్రికెటర్లను చంపేస్తాం!

టీమిండియా క్రికెటర్లను చంపేస్తామని ఓ యువకుడి నుంచి బీసీసీఐకి బెదిరింపు మెయిల్ వచ్చింది.

రాజ్‌తరుణ్‌ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడుగా!

టాలీవుడ్ కుర్ర హీరో రాజ్‌తరుణ్‌ కారు సోమవారం రాత్రి నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

'దర్పణం' సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి .. సెప్టెంబర్‌ 6న విడుదల

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ  వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'దర్పణం'..

అన్నం ముట్టని చిదంబరం.. ‘చెప్పలేను’.. ‘తెలీదు’ అంతే!

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం‌ను బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విషయం విదితమే.