మ‌హేశ్ అమెరికా వెళ్లింది అందుకా?

  • IndiaGlitz, [Saturday,January 25 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటాడు.. ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో స‌హా టూర్స్ వెళుతుంటాడు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. రీసెంట్‌గా మ‌హేశ్ హీరోగా న‌టించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజయాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత కొన్ని ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న మ‌హేశ్.. అమెరికా ట్రిప్ వెళ్లాడు. భార్య పిల్ల‌ల‌తో మ‌హేశ్ రెండు నెల‌లు పాటు అమెరికాలో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తాడ‌ని స‌మాచారం. అందుకు త‌గ్గట్లు అమెరికాలో పాప‌తో మ‌హేశ్ ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అయితే కొంద‌రు మాత్రం మ‌హేశ్ అమెరికాకు కేవ‌లం వెకేష‌న్‌కే వెళ్ల‌లేద‌ని.. మోకాలి ఆప‌రేష‌న్ చేయించుకోవ‌డానికి వెళ్లాడ‌ని అంటున్నారు. ఆగ‌డు సమయంలో మ‌హేశ్ మోకాలి గాయ‌మైంద‌ని, ఆ నొప్పి పెర‌గ‌డంతో మోకాలి ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని మ‌హేశ్ నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఆప‌రేష‌న్ ముందు, త‌ర్వాత మొత్తంగా నాలుగైదు నెల‌లు పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్స్ సూచించార‌ట‌. ఈ ఆప‌రేష‌న్ త‌ర్వాత మ‌హేశ్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించ‌నున్నారు.

More News

ఢిల్లీ నుంచి ఆదేశాలు.. పవన్ చెప్పినోళ్లకే ఆ కీలక పదవి!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీతో కలిసి అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలోని కమలనాథులతో భేటీ అయిన పవన్ కల్యాణ్..

తండ్రి బాటలో వైఎస్ జగన్.. ఫిబ్రవరి 1 నుంచి..!!

‘ప్రజా సంకల్ప యాత్ర’ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్న వైఎస్ జగన్.. మరోసారి గ్రామాల బాట పట్టనున్నారా..?

`RRR` ఫైనాన్సియ‌ర్ ఎవ‌రో తెలుసా?

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి`

ఫృథ్వీ సరస సంభాషణ ఎఫెక్ట్ : కీలక నిర్ణయం!

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ ఓ ఉద్యోగినితో ఆయన జరుపుతున్న సరస సంభాషణ ఆడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

చైనాను వణికిస్తున్న పాములు

‘కరోనా’.. ఈ మూడు అక్షరాల పేరుగల వైరస్ పేరు వింటుంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు..