విమాన ప్రమాదానికి కారణాలివేనా?

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

కేరళలోని కోజికోడ్ విమానశ్రయంలో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలను నిపుణులు అన్వేషిస్తున్నారు. భారీ వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా రన్‌వే మొత్తం చిత్తడిగా మారిపోయింది. అప్పటికే రెండు సార్లు ఆకాశం చక్కర్లు కొడుతూ ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కు యత్నించింది. మూడో ప్రయత్నంలో భాగంగా పట్టును కోల్పోయింది. మరోవైపు రన్‌వే మీద నిర్ధారిత వేగం కన్నా మించిన వేగంతో ల్యాండింగ్‌ కావడంతోనే ప్రమాదం జరిగివుంటుందని నిపుణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టేబుల్ టాప్ రన్‌వే కారణమా?

కేరళలోని కోజికోడ్‌లో విమాన ప్రమాదం జరిగిన విమానాశ్రయం.. టేబుల్ టాప్ రన్ వేతో కూడినది. టేబుల్ టాప్ రన్‌వే అంటే.. రన్‌వేకి ఇరువైపులా చిన్నపాటి లోయలుంటాయి. విమానం ఏమాత్రం తడబడినా లోయలోకి జారిపోవడం ఖాయం. ఈ కారణంగానే విమాన ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రమాదానికి గురైన విమానంలోని ప్రధాన పైలెట్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఎన్నో ప్రశంసాపత్రాలను సైతం అందుకుని ఉన్నారు. అలాంటపుడు ఆయన చాలా అప్రమత్తంగానే ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు టేబుల్ టాప్ రన్‌వే కావడంతో విమానం రన్‌వే నుంచి కిందకు పడిపోయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More News

తెలంగాణలో కొత్తగా 2256 కేసులు...

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

క‌రోనా వైర‌స్‌కు అస‌లైన ఆయుధం ప్లాస్మా:  చిరంజీవి

‘‘ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు.

రెమ్యున‌రేష‌న్‌తో నిర్మాత‌కు షాకిచ్చిన న‌య‌న‌తార‌!!

కోలీవుడ్ నిర్మాత‌ల ద‌గ్గ‌ర న‌య‌న‌తార ఎంత రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తుందో తెలియ‌దు కానీ..

లోయలో పడిపోయిన విమానం.. 20 మంది మృతి

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ప్రముఖ సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.