రాధేశ్యామ్‌లో కృష్ణంరాజు లుక్ ఇదే .. ప్రశాంతంగా, చేతిలో రుద్రాక్ష మాలతో ‘‘పరమహంస’’గా

  • IndiaGlitz, [Monday,December 20 2021]

బాహుబలి, సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న రాధేశ్యామ్ థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధలు నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగా ఈ నెల 23న హైదరాబాద్‌లో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజ్ అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ‘‘రాధేశ్యామ్’’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు 'పరమహంస' క్యారెక్టర్‌లో ఆయన కనిపించనున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సోమవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. కాషాయ దుస్తుల్లో చాలా ప్రశాంతంగా రుద్రాక్ష మాలను చేతబూనిన కృష్ణంరాజును ఫస్ట్ లుక్ లో చూడొచ్చు. పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు. ఇదిలా వుంటే కృష్ణం రాజు, ప్రభాస్‌తో కలిసి 'బిల్లా', 'రెబల్'‌ సినిమాల్లో కలిసి నటించారు. చివరిసారిగా 2015లో అనుష్క- గుణశేఖర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రంలో గణపతి దేవుడుగా కనిపించారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత రాధేశ్యామ్‌ కోసం కృష్ణంరాజు మేకప్ వేసుకున్నారు.

మరోవైపు వరుస సినిమాలతో బిజీగా వున్న ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘ప్రాజెక్ట్ కే’’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌ను ఇటీవలే స్టార్ట్ చేశాడు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోణే హీరోయిన్‌గా నటిస్తుండగా... బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు 'సలార్‌', 'ఆదిపురుష్‌' చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్‌.

More News

జీవో నెం.35 రద్దు : ఆ కొన్ని థియేటర్లకే కాదు, అందరికీ వర్తింపు ... ఏపీ సర్కార్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్‌ రేట్ల వ్యవహారం గందరగోళానికి గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. జీవో నెం 35కి హైకోర్టు రద్దు చేసినా..

బ్లాక్‌మనీపై అస్త్రం  : ఆకట్టుకుంటోన్న సత్యదేవ్ ‘‘గాడ్సే’’ టీజర్

విలక్షణమైన కథలతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న యువ హీరో సత్యదేవ్. రోటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా కథకు స్కోప్ వుండే చిత్రాలు చేస్తూ..

పనామా పేపర్స్ లీక్ కేసు: ఐశ్వర్యరాయ్‌కి ఈడీ నోటీసులు.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

నిన్న మొన్నటి వరకు డ్రగ్స్ వ్యవహారంతో బాలీవుడ్ బిగ్‌షాట్‌లను కేంద్రం వణికించిన సంగతి తెలిసిందే.

ఎవరీ వీజే సన్నీ.. జర్నలిస్ట్ స్థాయి నుంచి బిగ్‌బాస్ విన్నర్ ఎలా కాగలిగాడు..?

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా వినిపిస్తున్న మాట వీజే సన్నీ.

‘అరె షన్నూ ఏంట్రా ఇది’ .. ఆడమంటే హగ్గులిచ్చావు, సన్నీ నీకు స్ట్రోక్ ఇచ్చాడు

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ ముగిసింది. తొలి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు తగట్టుగానే వీజే సన్నీ విజయం సాధించాడు.