దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. తాజాగా 77 వేలకు పైగా కేసులు

  • IndiaGlitz, [Friday,August 28 2020]

భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో కొత్త రికార్డులు సాధిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే ఒకరోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు చేసుకున్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా బుధవారం - గురువారం మధ్య 75,760 కేసులు నమోదు చేసుకుంది. కాగా నిన్న అంతకంటే ఎక్కువ కేసులు నమోదు చేసుకోవడం దేశంలో కరోనా ఎంత భయంకరంగా విజృభిస్తోందో తెలియజేస్తోంది.

కాగా శుక్రవారం హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 33,87,501కి చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 1075 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 61,529కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,177 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. దేశ వ్యాప్తంగా 25,83,948 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా పడిన వారిలో 76.28 శాతం మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 7,42,023 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం ఒక్కరోజే 9,01,338 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

More News

నన్ను కావాలని ఈ వివాదంలోకి లాగుతున్నారు: యాంకర్ ప్రదీప్

తనపై దాదాపు 150 మంది లైంగిక దాడి జరిపారంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది.

‘ఆచార్య’ కథపై స్పందించిన చిత్ర యూనిట్..

‘ఆచార్య’ కథ కాపీ అంటూ వస్తున్న ఆరోపణలపై చిత్ర యూనిట్ స్పందించింది. నేడు అధికారికంగా ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

‘అల వైకుంఠపురములో’ మరో సంచలన రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉంది.

మీడియాపై రియా చక్రవర్తి ఫైర్.. కొద్ది నిమిషాలకే పోస్ట్ డిలీట్..

మీడియాపై బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.

రియా చాలా రోజుల పాటు నా కుమారుడికి విషమిచ్చింది: సుశాంత్ తండ్రి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.