ఇటలీలోని డోలమైట్స్ లో  'రెడ్‌' సాంగ్‌ చిత్రీకరణ

  • IndiaGlitz, [Friday,February 21 2020]

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా 'రెడ్‌' సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మి స్తున్న'రెడ్' చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్నిడోలమైట్స్ లో షూట్‌ చేయడం విశేషం.

ఆ ముచ్చట్లను 'స్రవంతి' రవికిశోర్‌ వివరిస్తూ - ''ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ లో రామ్‌, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభిమాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని టుస్కాన్ ,ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత ప్రాంతం. సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే! ఈ రెండు పాటలూ చాలా బాగా వచ్చాయి. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్ గా జరిగే వెనీడియా కార్నివాల్‌లో కూడా అనుమతి తీసుకుని పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. దీంతో ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీ కరిస్తాం'' అని తెలిపారు.

చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ ''ఇస్మార్ట్ శంకర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాతరామ్‌ నుంచి వస్తున్న ఈ చిత్రం క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓపెనింగ్‌రోజున ప్ర కటించినట్టుగానే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం'' అని చెప్పారు.

రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం : కిశోర్‌ తిరుమల.

More News

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసిన మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌

‘విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం.. కాలవాంది సొంతం.. పెరిగిందే ఇష్టం..’ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ సాహిత్యానికి అనూప్‌ రూబెన్స్‌ అందించిన స్వరాలు తోడైతే..

'ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య' టీజ‌ర్ విడుద‌ల‌.. ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`.

హిట్ సినిమా సీక్వెల్‌కు సురేందర్ రెడ్డి ప్లాన్!

అవును మీరు వింటున్నది నిజమే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సీక్వెల్ సినిమాకు రెడీగా ఉన్నాడట.

డ్యామిట్ సీన్ రివర్స్.. సుజనా 400 కోట్ల ఆస్తుల వేలం!

సుజనా చౌదరీ గుర్తున్నాడుగా.. అదేనండి 2019 ఎన్ని్కల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలవ్వడం, తన ఆస్తులను సీబీఐ, ఈడీల నుంచి తప్పించుకోవడాకి కమలనాథుల సమక్షంలో

కొడుకు కావాలని యువతితో వృద్ధుడి పాడు పని!

లేటు కుమారుడ్ని కనాలనుకున్నాడు.. కానీ సొంత భార్యతో అది వర్కవుట్ కాలేదు.. ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉండటంతో ఉన్న ఆస్తిని అనుభవించడానికి కుమారుడు కావాలని విశ్వప్రయత్నాలు చేశాడు..