పెంకి అమ్మాయిగా రెజీనా

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

పిల్లా నువ్వు లేని జీవితం, ప‌వ‌ర్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, జో అచ్యుతానంద వంటి విజ‌యవంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన యువ క‌థానాయిక రెజీనా. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న ఈ చెన్నై చిన్న‌ది.. ప్ర‌స్తుతం నారా రోహిత్‌కి జోడీగా బాల‌కృష్ణుడు చిత్రం చేస్తోంది. ఈ నెల 24న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఈ సినిమా త‌న కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుంద‌ని రెజీనా చెప్పుకొస్తోంది. అంతేకాకుండా.. ఇందులో త‌ను డ‌బ్బు ఉన్న అమ్మాయిగా క‌నిపిస్తాన‌ని.. త‌ను ఏం కావాల‌నుకుంటే అది జ‌రిగిపోవాల‌నుకునే మ‌న‌స్త‌త్వం ఉన్న పెంకి అమ్మాయి పాత్ర‌లో న‌టించాన‌ని రెజీనా చెప్పుకొస్తోంది.

యాక్టింగ్ స్కోప్ ఉన్న ఈ పాత్ర కోసం స‌బ్జెక్ట్ డిమాండ్ మేర‌కు ఫైట్స్ కూడా చేశాన‌ని.. ముఖ్యంగా రోప్ షాట్స్ చేయ‌డం కొత్త అనుభూతినిచ్చింద‌ని తెలిపింది రెజీనా. బాగా క‌ష్ట‌ప‌డి చేసిన ఈ సినిమా త‌న‌కు త‌ప్ప‌కుండా మంచి గుర్తింపు తీసుకువ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాన‌ని ధీమాగా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ‌.

More News

సుధీర్‌తో అదితి.. డౌట్‌లో ప‌డింది

జెంటిల్‌మాన్‌, అమీతుమీ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న యువ క‌థానాయ‌కుడు సుధీర్‌బాబుతో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ఒకే హీరోయిన్‌తో నాగ‌శౌర్య రెండు చిత్రాలు

ఊహ‌లు గుస‌గుస‌లాడే, క‌ళ్యాణ వైభోగ‌మే, జో  అచ్యుతానంద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

'భ‌ర‌త్ అను నేను' లోనూ అలాగే..

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ కోసం హీరోయిన్ పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

'దేవిశ్రీ ప్ర‌సాద్' ప్రీమియ‌ర్ షో

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.