రెట్రో లుక్‌లో రెజీనా!!

  • IndiaGlitz, [Saturday,May 23 2020]

ఎస్‌.ఎం.ఎస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన చెన్నై సొగ‌స‌రి రెజీనా క‌సండ్ర కొత్త ట‌ర్న్ తీసుకున్నారు. హీరోయిన్‌గానే కాదు.. పాత్ర న‌చ్చితే నెగిటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు చేయ‌డానికి కూడా ఓకే అంటున్నారు. 7, అ! వంటి సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో ఆమె అల‌రించారు. ఇప్పుడు తొలిసారి ఓ స్పెష‌ల్ సాంగ్‌లోనూ నర్తించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ స‌మ‌యంలో రెజీనా ఎక్క‌డ క‌న‌ప‌డ‌నేలేదు. సోష‌ల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అస‌లు రెజీనాకు ఏమైంది అని అంద‌రూ అనుకున్నారు కూడా.

అయితే రెజీనా ఉన్న‌ట్లుండి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అది కూడా స‌రికొత్త లుక్‌లో. ఇంత‌కు రెజీనా క‌న‌ప‌డ్డ లుక్ ఏంటో తెలుసా? రెట్రో లుక్‌. ఈ లుక్‌ను రెజీనా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ లుక్‌లో రెజీనాను చూసిన అంద‌రూ షాక‌వుతున్నారు. ఈమె అస‌లు రెజీనాయేనా? అని ఆమె అభిమానులు సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 2020లో ఈ చెన్నై బ్యూటీ నాలుగు సినిమాల‌తో తెర‌పై సందడి చేయ‌నున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఈ నాలుగు సినిమాలు త‌మిళ చిత్రాలే కావ‌డం. ఎవ‌రు త‌ర్వాత రెజీనాకు తెలుగులో అవ‌కాశ‌మే రాలేదు.

More News

'బ్యాడ్‌బాయ్‌' పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి, అమ్రిన్ ఖురేషి తారాగ‌ణంగా రాజ్‌కుమార్ సంతోషి రూపొందిస్తోన్న చిత్రం ‘బ్యాడ్‌బాయ్‌’.

మ‌రోసారి గాంధీజీపై సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసిన నాగ‌బాబు

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్విట్ట‌ర్ వేదికగా సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న నాధూరాం గాడ్సేకు అనుకూలంగా చేసిన ట్వీట్స్‌పై పెద్ద దుమార‌మే రేగింది.

నిర్మాత రిక్వెస్ట్.. మారుతి వెబ్ సిరీస్‌

ఓటీటీ మాధ్య‌మాలు జోరును ముందుగానే ఊహించిన తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. అందుక‌నే ఆయ‌న తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి తీసుకొచ్చారు.

శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే..

సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

సీనియర్ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం వాణిశ్రీకి పుత్రశోకం కలిగింది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ చెన్నైలోని తన ఇంట్లో చనిపోయారు.