మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్..

  • IndiaGlitz, [Monday,September 21 2020]

నటి రేణూ దేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలన్నీ త్వరలోనే ప్రకటిస్తానని స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఫోటో షూట్‌లో తీసిన స్టిల్‌ను కూడా ఆమె షేర్ చేసిన రేణు.. మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే నెల నుంచి తను నటించబోయే వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కాబోతోందన్నారు. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు.

వెబ్ సిరీస్‌లో తన పాత్ర గురించి రేణు మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ పాత్రలో తాను నటిస్తున్నానని రేణు తెలిపారు. ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌ను సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావు, రజనీకాంత్ నిర్మిస్తున్నారు. రేణు నటిగానే కాకుండా దర్శకురాలిగా.. నిర్మాతగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ‘అన్నదాత సుఖీభ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

More News

ఎన్టీఆర్ 30 కీల‌క పాత్ర‌లో శివ‌గామి!

ర‌మ్య‌కృష్ణ టాలీవుడ్ సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బాహుబ‌లి పుణ్య‌మాని రాజ‌మాత శివ‌గామి దేవిగా తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంది.

కొత్త జోన‌ర్‌కు చైతు ఓకే అంటాడా?

టాలీవుడ్ ట్రెండ్ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీస్‌లో న‌టించ‌డానికి స్టార్స్‌,

సంతకం పెట్టకుంటే తిరుమల అపవిత్రమవుతుందా?: కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

తిరుమలలో డిక్లరేషన్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

త‌మ‌న్నాకి ఏమైంది..?

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు ఏమైంద‌ని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

ఎవ్వరి ఊహకు అందని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్..

ఒక లైలా కోసం సాంగ్‌తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. సెల్ఫ్ నామినేట్ అవడం కరెక్ట్ కాదని నాగ్ మరోసారి కరాటే కల్యాణికి సూచించారు.