CM Revanth Reddy:ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

  • IndiaGlitz, [Monday,December 25 2023]

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. సచివాలయంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను గ్రామ సభల ద్వారా స్వీకరిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రజలు అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అనంతరం అందుకు సంబంధించిన ఓ రశీదు ఇస్తారని.. అది తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. స్వీకరణ ప్రక్రియ పూర్తైన వెంటనే ఎవరు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారని చెప్పారు.

'ధరణి' ప్రక్షాళన చేస్తాం..

అలాగే గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాల్లో కోత విధించమని స్పష్టంచేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తొలి రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి చూపించామని వివరించారు. దరఖాస్తులు అందించేందకు గ్రామ సభలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశాలిచ్చారని.. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందుతుందన్నారు.'ధరణి' పోర్టల్ ప్రక్షాళనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినపడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్..

అనంతరం బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశామని వారే ఒప్పుకున్నారని విమర్శించారు. సచివాలయాన్ని కూల్చి కొత్తది ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష పూరిత చర్యలుండవని తప్పు చేస్తే మాత్రం వదిలి పెట్టమని తేల్చిచెప్పారు.

More News

AA Creations RK Cinema:లాంఛనంగా ప్రారంభమైన AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం

వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1

Ankura Hospital:హైదరాబాద్‌లోని అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్‌లోని అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

JD Lakshminarayana:జేడీ లక్ష్మీనారాయణ.. మరో జేపీ అవుతారా..? కేజ్రీవాల్ అవుతారా..?

ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించడం సులభం. కానీ ఆ పార్టీని విజయవంతంగా

Chandrababu, Prashant Kishore:షాక్‌లో సీఎం జగన్.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ..

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో

రోజురోజుకు దిగజారుతున్న టీడీపీ.. సైబర్ నేరస్థుడికి వత్తాసు..

ఇంతకన్నా ఏం దిగజారుతుంది అనుకున్న ప్రతిసారీ మరింత దిగజారుతుంది తెలుగుదేశం పార్టీ. విదేశాల్లో ఉంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు, కుటుంబసభ్యులను