close
Choose your channels

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Saturday, June 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంపీ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సచివాలయ భవనాలను కూల్చాలనే దుర్మార్గమైన ఆలోచనను కేసీఆర్ మానుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎస్‌ను కలవాలని ఇవాళ ఉదయం నుంచి ప్రయత్నించానని.. అయితే ఆయన లేకపోవడంతో కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చానన్నారు. సచివాలయ భవనాలను కూల్చి వాస్తు పండితులు చెప్పినట్లు కొత్త భవనాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారని.. అయితే గతంలోనే వందేళ్ల కోసం భవనాలను నిర్మించారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుత సచివాలయంలో కొన్ని భవనాలు 15 ఏళ్ళు కూడా కాలేదన్నారు. వందల కోట్ల విలువైన భవనాలను కూల్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవనాల కూల్చివేతలో ప్రజావాసరం లేదన్నారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించినా ఇంకా స్థలం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. కొడుకు ముఖ్యమంత్రి కాలేరని వాస్తు పండితులు చెప్పారని.. అందుకే కేసీఆర్ భవనాలను కూల్చేందుకు సిద్దమయ్యారని రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రులు ప్రధాని, రాష్ట్రపతి అయ్యారన్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఇక్కడ సచివాలయం ఉండగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. కేసీఆర్ ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వందేళ్ల కోసం వందల కోట్లతో కట్టిన భవనాలను ఉన్నపళంగా కూలగొడతామంటే తాము ఒప్పుకోమన్నారు. వాస్తును నమ్మొచ్చు.. కానీ పిచ్చిగా వ్యవహరించడం తగదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.