మ‌రో వివాదానికి రాంగోపాల్ వ‌ర్మ శ్రీకారం

  • IndiaGlitz, [Tuesday,November 19 2019]

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే ద‌ర్శ‌కుడెవ‌రంటే ఎవ‌రికైనా వెంట‌నే గుర్తుకొచ్చే పేరు రాంగోపాల్ వ‌ర్మ‌. ఈయ‌న ప్రస్తుతం 'క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. సందీప్ మాధ‌వ్‌(సాండీ)తో 'దాదాస్ ఆఫ్ హైద‌రాబాద్‌' అనే సినిమాను రూపొందించబోతున్న‌ట్లు వ‌ర్మ తెలిపారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్వీట్ ద్వారా తెలిపారు. ''ఇప్పుడే 'జార్జిరెడ్డి' సందీప్ మాధ‌వ్‌తో సైన్ చేయించాను. త‌న‌తో 'దాదాస్ ఆఫ్ హైద‌రాబాద్‌' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాను. 80 ద‌శకంలో హైద‌రాబాద్‌లోని రౌడీల‌కు సంబంధించిన సినిమా చేస్తాను. విజ‌య‌వాడ రౌడీలు, రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్టులకు చెందిన సినిమాల త‌ర్వాత ఈ సినిమా చేస్తాను. నా శివ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన నిజ‌మైన పాత్ర‌ను ఇందులో చూపిస్తాను'' అన్నారు రామ్‌పాల్ వ‌ర్మ‌.

'ఎన్టీఆర్ ల‌క్ష్మీస్‌', 'క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు' సినిమాల‌తో పొలిటిక‌ల్ సెటైర్ మూవీస్‌ను తెర‌కెక్కించిన రామ్‌గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల 'రెడ్డి రాజ్యంలో క‌మ్మ ఫ్యాన్స్‌' అనే సినిమాను వ‌ల్ల‌భ‌నేని వంశీ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించాల‌నుకుంటున్న‌ట్లు కూడా తెలిపారు. కాగా ఇప్పుడు 'దాదాస్ ఆఫ్ హైద‌రాబాద్‌'ను చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. సందీప్ మాధ‌వ్‌కు 'వంగ‌వీటి'సినిమాతో బ్రేక్ ఇచ్చింది రామ్‌గోపాల్ వ‌ర్మే. ఇప్పుడు మ‌రోసారి అదే హీరోతో వ‌ర్మ సినిమా చేయ‌నుండ‌టం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

More News

'పిచ్చోడు' ఆడియోను విడుదల చేసిన వరుణ్ సందేశ్, వితిక

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది.

'తొలుబొమ్మలాట' సినిమాతో మళ్ళీ మీ గుండెల్లో నేను ఉండిపోతాను - డా.రాజేంద్రప్రసాద్

డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'తోలుబొమ్మలాట'.

మనల్ని మనం ప్రశ్నించుకునే చిత్రం "ప్రతిరోజు పండగే" - హీరో సాయితేజ్

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా... మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా...

లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా వార్తలపై రమేష్ క్లారిటీ

లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్ఈపీఎల్) కంపెనీ దివాలా తీసినట్లు వస్తున్న వార్తలపై ఎల్ఈపీఎల్ కంపెనీ అధినేత లింగమనేని రమేష్ స్పష్టతనిచ్చారు.

సుమంత్ చిత్రానికి 'క‌ప‌ట‌ధారి' టైటిల్ ఖ‌రారు

హీరో సుమంత్, ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రానికి `క‌ప‌ట‌ధారి` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.