close
Choose your channels

నేనొక ముళ్ల పందిని.. సీక్రెట్స్ అన్నీ చెప్పను: ఆర్జీవీ

Tuesday, February 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేనొక ముళ్ల పందిని.. సీక్రెట్స్ అన్నీ చెప్పను: ఆర్జవీ

సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన నాటి నుంచి మూడు గొడవలు.. ఆరు వివాదాలుగా షూటింగ్ సాగింది. అయితే వీటన్నింటినీ కూడా ఆయన తన మాస్టర్ మైండ్‌తో ఒక ప్రమోషన్‌‌లాగానే వాడేసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌‌ను సినీ, రాజకీయ ప్రముఖులు చూస్తున్నట్లు మార్పింగ్ చేసిన ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా పెద్ద పంచాయితీ పెట్టారు. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు కథేంటో చెప్పేశారు.

రాంగోపాల్ వర్మ మాటల్లోనే..

"నా శ్రేయోభిలాషి ఒకరు ఉన్నారు. వారి ఫ్రెండ్ ఆయనతో మాట్లాడుతూ రామ్‌‌గోపాల్ వర్మ ఏంటి మరీ ఇంత చీప్‌‌గా పబ్లిసిటీ చేస్తారు..?. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా..?. ముఖ్యంగా ట్రైలర్ చాలా బాగుంది. కానీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీచ, మోదీ చూస్తున్నట్లు ఉన్నాయని ఇంత చీప్‌‌ పబ్లిసిటీ ఎందుకు?. అసలు అలాంటివి అవసరం లేదు అని నా సలహా అని మీ ఫ్రెండ్‌‌కు చెప్పండి అని నా శ్రేయోభిలాషికి వివరించారు. ఇందుకు నేను చాలా సమాధానం ఇచ్చాను" అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అయితే శ్రేయోభిలాషి మిత్రుడికి ఆర్జీవీ కింది విధంగా ఇంటర్వ్యూ వేదికగా చురకలింటించారు.

ఆర్జీవీ ఆన్సర్..:- ఆయన సలహా ఆయనకే ఉపయోగించుకోమను. ఆయన్నే బుద్ధి చేసుకోమనండి. ఇక్కడ పాయింట్ ఏమంటే.. ‘నేను ఒక ముళ్లపందిని’.. ముళ్ల పందిని ముళ్లు వద్దంటే పందిగా వస్తాను(నవ్వుతూ). పందులే ముళ్లపందుల గురించి ఆలోచిస్తాయి. ముళ్ల పంది పందుల గురించి ఆలోచించదు. నేను చీప్ పబ్లిసిటీ చేస్తానా..? కాంట్రవర్సీ చేస్తానా..? కాకపోతే ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడతానా..? అనేది పాయింట్ కాదు. అవును నేను ముళ్లపందిని.. నన్ను నేనే తిట్టుకుంటున్నాను. అందుకే పందులు.. ముళ్ల పందులకు సలహా ఇవ్వకూడదు. ఆ శ్రేయోభిలాషి ఎవరో మీకు చెప్పను.. అది చాలా సీక్రెట్" అని నవ్వుతూ తన మాటను ముగించారు. అయితే అటు వైపు లైవ్‌‌లో ఉన్న లక్ష్మీపార్వతి, యాంకర్ ఇద్దరూ రెండు నిమిషాలపాటు ఆర్జీవీ మాటలకు నవ్వు ఆపుకోలేదు. ఎదుటి వారు నవ్వుతున్నా ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఆర్జవీ తాను చెప్పాలనుకున్నది చెప్పేసి మిన్నకుండిపోయారు.

కాగా.. ఆర్జీవీ తనను తాను తిట్టుకోవడం.. తనకు తాను ఏదేదో ఊహించుకోవడం ఇవాళేం కొత్తకాదు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం పోస్ట్‌‌లు పెట్టడం, ‘ఎవడేమనుకున్నా నాకేంటి’.. ఎవడైనా అడ్డొస్తే ఖబడ్డార్ అంటూ పెద్ద దుమారం రేపే పోస్ట్‌‌లు చేసిన సందర్భాలు కోకొల్లలు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.