బాల‌కృష్ణ‌పై వ‌ర్మ సినిమా?

బాల‌కృష్ణ‌పై రామ్‌గోపాల్ వ‌ర్మకు చెప్ప‌రాని కోపం అయితే ఉంది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌ర‌సం లేదు. బాల‌కృష్ణ అప్ప‌ట్లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించాల‌ని అనుకున్నప్పుడు ముందు ఆర్జీవీనే డైరెక్ట‌ర్‌గా అనుకున్నారు. చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కానీ చివ‌రి నిమిషంలో ఆర్జీవీని ప‌క్క‌న పెట్టేసి తేజ‌ను డైరెక్ట‌ర్‌గా ఓకే చేశారు బాల‌య్య‌. చివ‌ర‌కు తేజ కూడా ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. త‌న‌ను ప‌క్క‌న పెట్టేసిన బాల‌కృష్ణ‌పై కోపంతో వ‌ర్మ త‌న‌దైన శైలిలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం మేర‌కు ఇప్పుడు ‘ఆ రోజు త్రి ఏం జ‌రిగిందంటే’ అనే సినిమాను ఆర్జీవీ తెరకెక్కించ చేయబోతున్నారని సమాచారం. కొన్నేళ్ల క్రితం బాల‌కృష్ణ త‌న నిర్మాత బెల్లంకొండ సురేష్‌, జ్యోతిష్యుడుపై కాల్పులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న త‌ర్వాత బాల‌కృష్ణ చుట్టూ చాలా ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ట‌. అస‌లు బాల‌కృష్ణ కేసు నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ఏం జ‌రిగింద‌నే సంగ‌తుల‌ను బేస్ చేసుకుని వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నట్లు వార్త‌లు వివినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ సినిమాను తెర‌కెక్కిస్తున్న వ‌ర్మ ఆ సినిమా త‌ర్వాత ‘ఆ రోజు రాత్రి ఏం జ‌రిగిందంటే’ సినిమాను తెరకెక్కించబోతున్నారట.

More News

ర‌జినీ పొలిటిక‌ల్ అనౌన్స్‌మెంట్ అప్పుడేనా?

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఓటీటీలో త‌మ‌న్నా, కాజ‌ల్ సినిమా!!

2014లో హిందీలో వచ్చిన ‘క్వీన్’ సినిమా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఐదేళ్ల త‌ర్వాత అదే డైరెక్ట‌ర్‌తో సందీప్‌....

ప్ర‌స్థానం సినిమాతో న‌టుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సందీప్ కిష‌న్ అటు త‌మిళం, ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు సందీప్‌.

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఊరట

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊరట లభించింది.