close
Choose your channels

ట్రంప్‌ పర్యటనకు కోటి మంది.. ఆర్జీవీ ఐడియా!

Saturday, February 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ట్రంప్‌ పర్యటనకు కోటి మంది.. ఆర్జీవీ ఐడియా!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడి తొలి భారత పర్యటన ప్రారంభం కానుంది. పర్యటనకు ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్, కూతరు ఇవాంకా, అల్లుడు జేరెడ్ కుష్నర్ కూడా హాజరుకానున్నారు. అయితే ట్రంప్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో నిర్వహించే రోడ్‌ షో, నమస్తే ట్రంప్‌ కార్యక్రమాలలో ట్రంప్‌ పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాలకు స్వాగతం పలికేందుకు కోటి మంది వరకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారట. కోటి మంది వస్తున్నారని ఆశిస్తున్న ట్రంప్ పర్యటనపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఇలా చేయండి!

‘ట్రంప్‌కు స్వాగతం పలకడానికి కోటి మంది రావాలని అనుకుంటున్నారని తెలిసింది. నిజంగానే కోటి మంది రావడానికి ఒకే మార్గం ఉంది. అదేమిటంటే.. ఆయనతో పాటు స్టేజీపైన బాలీవుడ్‌ స్టార్ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, సూపర్ స్టార్ రజనీకాంత్‌, కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనె, సన్నీ లియోన్‌ ఇలా వీరందరూ వరుసగా నిలబెడితే ఆయన అకున్నట్లు కోటిమంది కచ్చితంగా వస్తారు’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్‌కు ఆయన వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరైతే పడిపడి నవ్వుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.