"నేను త్వరగా చనిపోవాలి, అందరికీ సంక్రాంతి విషెస్".. వర్మ వెరైటీ ట్వీట్

  • IndiaGlitz, [Friday,January 14 2022]

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు ప్రతిరోజూ ఎవరో ఒకరిని గిల్లకపోతే రామ్‌గోపాల్ వర్మకు నిద్రపట్టదు. కొందరు ఆయనకు పిచ్చి అంటారు.. ఇంకొందరు ఆయను జీనియస్ అంటారు. అందరూ ఎడ్డెం అంటే.. ఆర్జీవీ మాత్రం తెడ్డెం అంటాడు. దర్శకుల్లో ఆయన స్పెషల్. వివాదాలతో సహజీవనం చేసే వర్మకు యూత్‌లో మంచి క్రేజ్ వుంది. ఆయనంటే పడిచచ్చేవారు కోట్లలో వున్నారు.

కొద్దిరోజుల పాటు సైలెంట్‌గా వున్న ఆయన.. సినిమా టికెట్ల వివాదంతో మళ్లీ యాక్టీవ్ అయ్యారు. ఏపీ ప్రభుత్వంపై.. ముఖ్యంగా మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఏకంగా అమరావతి వెళ్లి మంత్రిని కలిసొచ్చారు. తాజాగా వర్మ అభిమానులకు షాకిచ్చారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని ఆర్జీవీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో విశేషం ఏముంది అంటారా. ఆయన ఎప్పుడూ పండగలకు విషెస్‌ చెప్పడానికి ఇష్టపడరు.

మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్‌ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా మరణించాలి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని రామ్‌ గోపాల్ వర్మ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More News

రాజకీయాలకు దూరం.. పదవులకు ఆశపడే వాడిని కాదు: రాజ్యసభ ఆఫర్‌పై తేల్చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం కృష్ణా జిల్లా డోకిపర్రు వచ్చారు చిరంజీవి.

ఢిల్లీ: పూల మార్కెట్‌లో బాంబు కలకలం.. నిర్వీర్యం చేసిన పోలీసులు

రిపబ్లిక్ డే వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్‌లో శుక్రవారం ఓ అనుమానాస్పద బ్యాగ్‌ వున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

డాక్టర్ దాసరి "దర్శకరత్న" బయోపిక్

సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే.

బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో పెరుగుతున్న మరణాలు... ఇప్పటి వరకు 9 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

కారంచేడులో సంక్రాంతి వేడుకలు.. అక్క పురంధేశ్వరి ఇంటికి బాలయ్య ఫ్యామిలీ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.