ద్వారకా తిరుమల ఆలయానికి రైస్ మిల్లర్స్ అసోషియేన్ భారీ విరాళం..

  • IndiaGlitz, [Monday,January 11 2021]

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శేషాద్రి కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం స్వామివారికి ఆలయంలో బంగారు వాకిరిని నిర్మిస్తున్నారు. దీని కోసం నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోటి రూపాయల విలువైన బంగారాన్ని విరాళంగా ఇచ్చింది. దీంతో స్వామి వారి ఆలయ వాకిలిని, తలుపులను బంగారం మయం చేస్తున్నారు. ఈ బంగారు వాకిలితో స్వామి వారి ఆలయం మరింత శోభాయమానంగా తయారవుతోంది.

ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ద్వారకా తిరుమల చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. స్వామివారు దక్షిణాభిముఖుడై ఉంటాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తిరుమలలో మొక్కిన మొక్కులను చిన్న తిరుపతిలో తీర్చుకున్నా అదే ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయం అంత ప్రసిద్ధి చెందింది.

More News

'దేవినేని' పాత్రలో తారకరత్న

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'దేవినేని'. దీనికి ''బెజవాడ సింహం'' అనేది ట్యాగ్ లైన్.

తుర్లపాటి మరణం నన్నెంతగానో బాధించింది: పవన్

ప్రముఖ జర్నలిస్ట్.. పద్మశ్రీ పురస్కార గ్రహీత తుర్లపాటి కుటుంబరావు(89) కన్నుమూశారు.

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి:  రజినీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని రీసెంట్‌గా తెలియజేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రాలకు నేడు కరోనా వ్యాక్సిన్.. సాయంత్రంలోపు హైదరాబాద్‌కు..

అన్ని రాష్ట్రాలకు ఇవాళ కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం పంపిణీ చేయనుంది. పుణె నుంచి అన్ని రాష్ట్రాలకు కొవిషెల్డ్ వ్యాక్సిన్‌ను పంపించనున్నారు.

మెగాస్టార్ ఆ సెంటిమెంటును ఫాలో అవుతారా?

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారనడంలో సందేహం లేదు. అలాగే మెగాస్టార్ కూడా సినిమా రిలీజ్ విషయంలో సెంటిమెంటను ఫాలో అవుతారని టాక్ నడుస్తోంది.