అంజలి ప్రధాన పాత్రలో, రాయ్ లక్ష్మి కీలక పాత్రలో ఆర్ కె స్టూడియోస్ బ్యానర్ ద్విభాషా చిత్రం

  • IndiaGlitz, [Friday,December 15 2017]

గుంటూరు టాకీస్, రాజా మీరు కేక వంటి వినోదాత్మ‌క చిత్రాల‌ను, షూటింగ్ ద‌శ‌లో ఉన్న ప‌వ‌నిజం-2 వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ గారు నిర్మాత‌గా, నంది అవార్డు గ్ర‌హీత క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో.. గీతాంజ‌లి, చిత్రాంగ‌ద వంటి చిత్రాల‌తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో, కాంచ‌న సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ ల‌క్ష్మి కీల‌క పాత్ర‌ల్లో త్వ‌ర‌లోనే ఒక స‌రికొత్త‌ చిత్రం ప్రారంభం కానుంది.

కొన్ని య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా, వినూత్న‌మైన సోష‌ల్ ఎలిమెంట్స్ తో కూడిన క‌థ‌తో, వినోదం మరియు ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని,ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలియ‌ప‌రిచారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మి, సాయి కుమార్, న‌రేష్, శివ‌ప్ర‌సాద్, ధ‌న్‌రాజ్, జాకీ, అశోక్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి, సంగీతంః మ‌ణిశ‌ర్మ‌ సినిమాటోగ్ర‌ఫీః పి.జి విందా ఎడిటింగ్ః త‌మ్మిరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌త్తి సురేష్ కుమార్ ప్రొడ్యూస‌ర్ః ఎమ్. రాజ్‌కుమార్ క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః క‌ర్రి బాలాజీ

More News

'బాహుబలి' సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేసిన 'లాయల్‌ ఎల్‌.ఇ.డి.' లైట్స్‌

శ్రీ బాలాజీ వీడియోస్‌ ద్వారా 300కు పైగా తెలుగు సినిమాలను విడుదల చేసిన నిరంజన్‌ పన్సారి వీడియో రంగంలో

'ఎం.సి.ఎ' సెన్సార్ పూర్తి

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది.

భాయ్ పాత్ర‌లో తేజ్‌...

మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌..ప్ర‌స్తుతం మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సి.క‌ల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

సునీల్ ప్లేస్‌లో స‌త్య‌దేవ్‌...

త‌మిళంలో సినిమాటోగ్రాఫ‌ర్ న‌ట‌రాజ్ హీరోగా చేసిన చిత్రం 'చ‌తురంగ వేట్టై'. వినోద్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీదేవి మూవీస్ రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

సినీ ఇండస్ట్రీలో చాలా మంది నిజాలను కార్పెట్ కింద దాచేస్తున్నారు: డి సురేష్ బాబు

పెళ్లిచూపులు  తరువాత నిర్మాత రాజకందుకూరి ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం 'మెంట‌ల్ మ‌దిలో' ఈ చిత్రానికి  వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. డి.సురేశ్‌బాబు సమర్పించారు.