చేవెళ్లలో ఘోర ప్రమాదం.. ఆ చిన్నారిని చూసి స్థానికుల కంటతడి

  • IndiaGlitz, [Wednesday,December 02 2020]

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బోర్‌వెల్‌ను ఢీకొనడంతో డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులంతా హైదరాబాద్‌ తాడ్‌బండ్‌ వాసులుగా గుర్తించారు. మల్కాపూర్ గేట్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు ఆసిఫ్ ఖాన్(50), మహేష్ షనియా(18) నజియ బేగం(45), నజియ భాను(36) హర్ష (28) చిన్నారి హర్ష భాను(6)గా గుర్తించారు. మృత్యుంజయుడిగా చిన్నారి..

చేవెళ్ల రోడ్డు ప్రమాదం పొగమంచు కారణంగానే జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారులోని వారంతా నిద్రలో ఉండగానే ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఓ చిన్నారి మాత్రం ఒంటిపై గాయాలు కూడా లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ చిన్నారి కళ్లు తెరిచి చూసేసరికి తనవాళ్లందరూ రక్తమోడుతూ కనిపించారు. ఏం జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. చుట్టూ తన వాళ్ల శవాలు.. షాక్‌లో తల్లి శవానికి దగ్గరలో కూర్చుండిపోయాడు.

జరిగిన ఘోరాన్ని చూసి పసిప్రాణం అల్లాడిపోయింది. తాము వచ్చిన వాహనం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారిపోయింది. భయంతో అమాయకంగా మొహం పెట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న బాలుడిని చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More News

నిహారిక వెడ్డింగ్‌ కార్డ్‌..ఎలా ఉందంటే!

మెగాబ్రదర్‌ నాగబాబు కొణిదెల కుమార్తె నిహారిక కొణిదెల వివాహాన్ని, గుంటూ ఐజీ ప్రభాకర్‌ రావు తనయుడు వెంకట చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే.

ఎమ్మెల్సీ కవిత రెండు ఓట్లు వేశారంటూ ఈసీకి ఫిర్యాదు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌లో తన ఓటును వదులుకోకుండానే జూబ్లీహిల్స్‌ డివిజన్‌ నుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారని

పీరియాడికల్‌ ప్రేమకథలో పూజ, రష్మిక

స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్‌, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించనుంది.

బిగ్‌బాస్‌ టైమ్‌ చేంజ్‌..

'నేను టైమ్‌ను నమ్మను టైమింగ్‌ను నమ్ముతాను' అని గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌ డైలాగ్‌ చెప్పిన డైలాగ్‌ గురించి చెప్పనక్కర్లేదు.

టికెట్ టు ఫినాలే టాస్క్‌: రౌండ్‌ 2లోకి అఖిల్, సొహైల్, అభి, హారిక..

ఓపెనింగే అఖిల్ తన ఫ్యామిలీ ఫోటోని ముందు పెట్టుకుని దిల్‌తో ఆడలేదు.. దిమాక్‌తో ఆడానంటూ ఎమోషనల్ అయ్యాడు.