త్రీడీ టెక్నాల‌జీలో రోబో సీక్వెల్ '2.0'

  • IndiaGlitz, [Saturday,September 23 2017]

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా '2.0' నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా శ‌నివారం ఈ సినిమా ప్రెస్‌మీట్ హైద‌రాబాద్‌లోజ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హాలింగం, డి.సురేష్‌బాబు, శ‌ర‌త్‌మ‌రార్‌, భ‌ర‌త్‌, స‌త్యం, ప్రీత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హాలింగం మాట్లాడుతూ - "ఇండియా బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా రోబో సీక్వెల్‌గా 2.0 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇండియాలో కాకుండా సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు చేస్తున్నాం. సినిమాను 2డీలోనే కాకుండా 3డీలో కూడా రూపొందిస్తున్నాం. ఏదో త్రీడీ రిగ్ అమ‌ర్చాల‌ని కాకుండా సినిమాను త్రీడీలో చేయ‌డం కాస్తా రిస్క్‌తో కూడిన వ్య‌వ‌హార‌మే అయినా, ప్రేక్ష‌కులకు ఓ కొత్త అనుభూతిని అందించాల‌నే త‌ప‌న‌తో సినిమానంత‌ట‌టినీ 3డీలో చేస్తున్నాం. సినిమాను చైనాలో ప‌దిహేను నుండి ప‌ద‌హారు వేల థియేట‌ర్స్‌లో విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం"అన్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

More News

వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న అంజలి సోదరి.. ఆరాధ్య!

కథానాయికల చెల్లాయిలు..వెండి తెరపై అడుగుపెట్టడం,తమ సత్తా చాటుకోవడం చూస్తూనే ఉన్నాం.

ఎన్టీఆర్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జైల‌వ‌కుశ మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లో రూ.60 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఓవ‌ర్‌సీస్‌లో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లోకి చేరింది. ఈ చిత్రంలోని జై పాత్ర‌లో తార‌క్ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. 

నారా రోహిత్ 'బాలకృష్ణుడు' ఫస్ట్ లుక్ విడుదల

సరస్ చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్,మాయా బజార్ మూవీస్ పతాకాలపై విలక్షణ నటుడు నారా రోహిత్,

మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న హార‌ర్ కామెడీ 'వ‌స్తా'

భానుచంద‌ర్‌, జీవా, అదిరే అది, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా 'వ‌స్తా'. జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కుడు. ద‌మిశెల్లి రవికుమార్, మొహ్మ‌ద్ ఖ‌లీల్ నిర్మాత‌లు. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

మళ్లీ సంగీత దర్శకుడుతోనే..

18 ఏళ్ల క్రితం విడుదలై మ్యూజికల్ హిట్ అయిన శీను(వెంకటేష్ హీరో)చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శశి.