తెలుగు , తమిళ భాషలలో 'సైరత్ ' ని రీమేక్ చేయనున్న 'రాక్ లైన్ ' వెంకటేష్ , జీ స్టూడియోస్

  • IndiaGlitz, [Saturday,June 17 2017]

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'సైరత్'. కొత్త తారలతో 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం 100 కోట్ల మైలురాయిని దాటినా తొలి మరాఠీ భాషా చిత్రం గా రికార్డులు సృష్టించింది. పరువు హత్యల నేపథ్యం లో రూపొందించిన ఈ చిత్రం లో ఆకాష్ తొషర్, రింకు రాజగురు హీరో హీరోయిన్లు గా నటించారు. నాగరాజ్ మంజులే దర్శకత్వం చేసారు . ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, కరన్ జోహార్ వంటి ఎందరో ప్రముఖ బాలీవుడ్ తారల మనసు దోచుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ రైట్స్ కోసం విపరీతమయిన క్రేజ్ నెలకొంది. చివరికి భారీ మొత్తం చెల్లించి ప్రముఖ నిర్మాణ సంస్థ రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత వెంకటేష్ మరియు జీ స్టూడియోస్ సంస్థ చేజిక్కించుకున్నారు

ఈ సందర్భం గా రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ... "నా మనసుకి నచ్చిన సినిమా ఇది. చుసిన వెంటనే ఈ సినిమా రీమేక్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాo.66వ బెర్లిన్ చిత్రోత్సవం లో ఈ సినిమా చుసిన అందరు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. లాస్ ఏంజెల్స్ లో ని సోనీ సింఫనీ స్టూడియో లో పాటల రికార్డింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. అందరికి బాగా తెలిసిన కథనే దర్శకుడు నాగరాజ్ మంజులే హృద్యంగా తెర పై ఆవిష్కరించారు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రింకు రాజగురు కి జాతీయ పురస్కారం కూడా దక్కింది. చిన్న సినిమాల లో పెద్ద విప్లవం తీస్కొచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో తెలుగు, తమిళం భాషలలో రీమేక్ చేయనున్నాం. తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యింది .ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక జరుగుతోంది .పూర్తి వివరాలు అతి త్వరలో నే తెలియచేస్తాం." అని తెలిపారు.

More News

'స్పైడర్' మరో టీజర్

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.

వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం...

ముకుంద, కంచె వంటి విలక్షణ చిత్రాల్లో నటించి మెప్పించిన యువ కథానాయకుడు వరుణ్తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం ఎల్ఎల్పి బ్యానర్పై కొత్త చిత్రం శనివారం హైదరాబాద్ ఫిలింనగర్లోని దైవ సన్నిధానంలో ప్రారంభమైంది.

మహేష్ పక్కన పూజా కన్ ఫర్మ్...

ఒక లైలా కోసం,ముకుంద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే

సిద్ధార్థ్ తో రకుల్...

పంజాబీ ముద్దుగుమ్మ అయిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.

ఎన్టీఆర్ కోసం థమన్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో కాదు,బుల్లి తెర పై కూడా కనిపించనున్నాడు.