close
Choose your channels

ఎట్టకేలకు నామినేటెడ్ పదవి దక్కించుకున్న రోజా

Saturday, July 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎట్టకేలకు నామినేటెడ్ పదవి దక్కించుకున్న రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమె ఎంత బాధపడిందో తెలియదు గానీ.. ఆమె అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. రోజా ఇక జబర్దస్త్, బతుకు జట్కా బండీ చేసుకోవడమేనని ప్రత్యర్థులు సెటైర్లు సైతం వేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు నానా హడావిడి చేసిన రోజా... మంత్రివర్గ విస్తరణ తర్వాత పత్తా లేకుండా పోయారు.

మీడియాలోనూ ఘాటూ విమర్శలు తగ్గిపోయాయి. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం మాట అయితే ఇచ్చారు కానీ.. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు మాత్రం వెలువడలేదు. దీంతో మళ్లీ రోజాకు ఎదురుచూపులు తప్పలేదు.

వ్యూహాత్మకంగానే జగన్ ఆమెను పక్కనబెట్టారని మళ్లీ ఎత్తిపొడుపులు మొదలయ్యాయి. అయితే ఈసారి పక్క పార్టీల నుంచి కాకుండా సొంత పార్టీలోను గొనుగుడు మొదలైనట్లు పసిగట్టిన వైసీపీ అధినేత... వేగంగా పావులు కదిపారు. రోజా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో అది అంతిమంగా పార్టీకి చేటు చేసే అవకాశం లేకపోలేదని వైసీపీ వ్యూహకర్తలు సైతం జగన్ చెవిన వేసినట్లు లోటస్ పాండ్‌ టాక్.

ఈ నేపథ్యంలో రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం రోజా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లుగా సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.