అయేషా తల్లి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా రియాక్షన్...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. దీంతో విచారణ మరింత వేగవంతమైంది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఇవాళ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించం జరిగింది. అయితే ఈ క్రమంలో అయేషా తల్లి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసు జరుగుతున్నప్పుడు హడావుడి చేసి రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.?.. దోషులెవరో రోజాకు తెలుసు. 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఆమె వ్యాఖ్యలపై రోజా రియాక్ట్ అయ్యారు.

నన్ను బాధించాయి..!

‘అయేషా తల్లి వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అప్పట్లో ఓ మహిళా అధ్యక్షురాలిగా ఆయేషా కుటుంబానికి అండగా ఉన్నాను. రాష్ట్రమంతా తిరిగి న్యాయం కోసం పోరాటం చేశాను’ అని రోజా చెప్పుకొచ్చారు. కాగా.. 12 ఏళ్ల తర్వాత ఇవాళ అయేషా మృతదేహానికి రీ-పోస్టుమర్టం నిర్వహించారు. సుమారు ఆరు గంటలకు పైగా.. అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి జరిగింది. అయితే మృతదేహాన్ని వెలికితీసి నిశితంగా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి.. ఆనవాళ్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. కాగా.. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు.. పుర్రె, అస్థికలపై గాయాలున్నట్లు గుర్తించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించింది.

More News

అయేషా పోస్టుమార్టంలో తాజాగా సీబీఐ ఏం తేల్చింది!?

విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషామీరా హత్య కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు న్యాయం ఇంతవరకూ జరగట్లేదని బాధితురాలి

గోపీచంద్‌ - సంపత్‌నంది కాంబినేషన్లో భారీ చిత్రం ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3 గా శ్రీనివాసా

'కె.జి.య‌ఫ్' అభిమానులకు గుడ్ న్యూస్

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం `కె.జి.య‌ఫ్‌` చాప్ట‌ర్ 2.

ఇన్‌టెన్స్ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్న రానా

'బాహుబ‌లి', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

నాగ‌చైత‌న్య తదుప‌రి ఖ‌రారైందోచ్‌!!

ఈ శుక్ర‌వారం `వెంకీమామ` విడుద‌లైంది. తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఈ సినిమా విడుద‌లై ఒక రోజు అయ్యిందో లేదో.. చైత‌న్య త‌దుప‌రి సినిమాను ఖ‌రారు చేశారు.