close
Choose your channels

పవన్ కల్యాణ్‌పై రోజా సంచలన కామెంట్స్

Saturday, March 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ కల్యాణ్‌పై రోజా సంచలన కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా సంచలన కామెంట్స్ చేశారు. రోజా చేసిన ఈ హాట్ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యాయి. శుక్రవారం రోజున నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ‌త్వ పాల‌న‌కు ప్రజ‌లు బుద్ధి చెప్పబోతున్నారని.. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

ఇది మాట మార్చడం కాదా..!?

"మొన్నటి వ‌ర‌కు విడివిడిగా ఉన్నట్లు క‌నిపించినా కూడా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కు అయిపోయాయి. వాళ్లిద్దరూ క‌లిసి ప్రజ‌ల‌ను మోసం చేస్తున్నార‌ు. లోకేష్‌ అవినీతిని ముందు నుంచి ప్రశ్నిస్తూ వ‌చ్చిన పవన్ క‌ళ్యాణ్ ఇప్పుడు త‌న మాట మార్చారు. నగరి నియోజకవర్గంలో ఉన్న దళితుల ఓట్లు చీల్చేందుకే ఇక్కడ ద‌ళిత పార్టీగా ముద్ర ప‌డిన బీఎస్పీకి సీటు కేటాయించారు. 2014లో నేను గెలిచిన రోజు నుంచి కూడా కావాల‌నే కక్షపూరితంగా అధికార పార్టీ వ్వవ‌హరించింది. నగరి నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇలాంటి పార్టీతో మ‌ళ్లీ ప‌వ‌న్ క‌లిసి ప‌ని చేయ‌డం మాట మార్చడం కాదా..?" అని రోజా వ్యాఖ్యానించారు. అయితే రోజా వ్యాఖ్యలకు పవన్, నాగబాబుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.