మేజ‌ర్ యాక్ష‌న్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత పునః ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. 50 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో మేజ‌ర్ యాక్ష‌న్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ అంతా రాత్రి వేళ‌ల్లోనే చిత్రీక‌రించారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియ‌చేయ‌డ‌మే కాకుండా త‌దుప‌రి షెడ్యూల్‌ను వెంట‌నే స్టార్ట్ చేస్తామ‌ని అన్నారు. త‌దుప‌రి షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌నే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఈ షెడ్యూల్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ పాల్గొంటార‌ని మాత్రం వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామాలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

More News

రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న సస్పెన్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం రంగ ప్రవేశం దాదాపుగా ఖరారై పోయింది.

‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చిత్రబృందానికి శుభాకాంక్షల వెల్లువ

మెగా హీరో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి.

ఇదే నిజమైతే.. టీఆర్ఎస్ ఖేల్ ఖతమే..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

110 మంది రైతుల దారుణ హత్య.. పొలాల్లో గుట్టలుగా శవాలు

పొలం పనులకు వెళ్లిన 110 మంది వ్యవసాయ కూలీలను అమానుషంగా హతమార్చిన ఘటన ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగరానికి సమీపంలో కోషోబ్‌ అనే గ్రామంలో

కుమార్తె పెళ్లి సంబంధం కోసం వెళ్తూ.. అమెరికాలో తెలుగు వారి మృతి

అమెరికాలో కుమార్తె వివాహ సంబంధం కోసం ఓ తెలుగు వారికి చెందిన కుటుంబం బయల్దేరింది. అంతే కొన్ని క్షణాల్లోనే కుటుంబంలోని ముగ్గురూ తిరిగిరాని లోకాలకు వెళ్లగా..