‘ఆర్ఆర్ఆర్’ విడుద‌ల వాయిదా.. రాజ‌మౌళి టార్గెట్ అప్పుడే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. రూ.400 కోట్ల‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బ్రిటీష్ భామ ఒలివియా మోరిస్ న‌టిస్తుండ‌గా రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది.

ఈ సినిమాను ముందు ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే చిన్న చిన్న కార‌ణాలు, మేకింగ్‌లో కాంప్ర‌మైజ్ కావాల‌నుకోక‌పోవ‌డంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తామ‌ని అధికారికంగా ప్ర‌కటించారు. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కు పోస్ట్ పోన్ అయ్యిందని, బాహుబ‌లి 2 విడుద‌లైన ఏప్రిల్ 28నే ఆర్ఆర్ఆర్ సినిమాను విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఇది వ‌ర‌కు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్‌పై వ‌చ్చిన వార్త‌ల‌పై ఆర్ఆర్ఆర్ మోష‌న్ పోస్ట‌ర్, భీమ్ ఫ‌ర్ రామ‌రాజుల్లో అదేం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మ‌రోసారి ఆర్ఆర్ఆర్ విడుద‌ల తేదీ వాయిదా ప‌డింద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి దీనిపై రాజ‌మౌళి అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

బ‌న్నీ చిత్రంలో క‌న్న‌డ స్టార్ హీరో ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.

కరోనాపై పోరుకు ఏపీలో ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌’...

కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌ను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసిన్‌

కరోనా నేపథ్యంలోనూ విజయసాయి వర్సెస్ మెగా బ్రదర్

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు

కేటీఆర్ పంచ్‌కి నా ముక్కు వాచింది: ఆర్జీవీ

వివాద‌స్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఇప్పుడు ఏకైక స్నేహితుడు సోష‌ల్ మీడియానే. సాధార‌ణ స‌మ‌యాల్లోనే సోషల్ మీడియాను ప్ర‌ధాన ఆయుధంగా

'మ‌హాస‌ముద్రం'లో సాయిప‌ల్ల‌వి

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు.