తమిళనాడు ఎన్నికల్లో రూ.428 కోట్లు సీజ్

  • IndiaGlitz, [Tuesday,April 06 2021]

తమిళనాడులో మరికొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రలోభాలకు తెరదీశాయి. బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఓటర్లకు పార్టీ నేతలు ఎరగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) దీనిపై దృష్టి సారించి.. బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్‌ చేసింది. వీటి విలువ ఎంతుంటుందో తెలిస్తే షాక్ అవక మానరు. వీటి విలువ అక్షరాల 428 కోట్ల రూపాయలని ఎస్ఈసీ తేల్చింది.

వీటిని ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచడంతో ఎస్ఈసీ దాడి చేసి సీజ్ చేసింది. వీటిలో రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలు మరో 72 గంటల్లో జరగనున్న నేపథ్యంలో.. ఈ సమయం అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వెల్లడించింది. విషయం తెలుసుకుని తమిళ వాసులు సైతం అవాక్కవుతున్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, కరూర్, తిరుప్పూర్, తదితర నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో అక్రమ సొత్తు బయటపడిన నగరాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై నగరాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. అయితే ఈ సొత్తు ఏ పార్టీకి చెందిందనే విషయం మాత్రం తెలియరాలేదు.

More News

154 నిమిషాల నిడివితో ‘వకీల్ సాబ్’ రాబోతున్నాడు..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

ఏప్రిల్‌ 23న విజయ్‌ సేతుపతి, జయరామ్‌ నటించిన ‘రేడియో మాధవ్‌’

విజయ్‌ సేతుపతి, జయరామ్‌ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కోని మతాయ్‌’. గుండేపూడి శీను సమర్పణలో

‘వైల్డ్ డాగ్’ చూశాక అడ్రినల్ రష్‌లాగా వచ్చింది: చిరు

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’.

‘రిపబ్లిక్’ టీజర్: ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం

దేవ్ కట్టా దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా రూపొందుతును్న సినిమా ‘రిపబ్లిక్’. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,

పేకాట క్లబ్‌లు, పైరవీలు చేసేవాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. : పవన్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.