సాయి పల్లవికి రూ. 5 కోట్ల లాస్.. ఎలా జరిగిందంటే?

  • IndiaGlitz, [Monday,May 17 2021]

ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో మాత్రం ఫిదా చిత్రంతో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే యువతని మాయచేసేసింది. అలాగని అందాల ప్రదర్శన చేయలేదు. తన నటన, చిలిపిదనంతోనే సాయి పల్లవి యువతని ఆకర్షించింది. 

స్కిన్ షోకి ఇప్పటికి సాయిపల్లవి ఆమడ దూరంలో ఉంటుంది. తన పాత్రలో గ్లామర్ అంశాలు ఉన్నా, ప్రాధాన్యత తక్కువ ఉన్నా ఆ చిత్రాన్ని వెంటనే రిజెక్ట్ చేసేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ విషయంలో సాయి పల్లవి చాలా క్లారిటీగా ఉంటుంది. గ్లామర్ రోల్స్ పై గతంలోనే సాయి పల్లవి కొన్ని కామెంట్స్ చేసింది. 

Also Read: అనుష్కపై స్టార్ హీరో క్రష్.. ఆమెకు ఫిదా అంటూ కామెంట్స్ 

నేను నటించే చిత్రాలు నా ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఉండాలి. వారు గర్వపడాలి.. అంతే కానీ ఇబ్బందిపడే విధంగా ఉండకూడదు. అందుకే నా చిత్రాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని సాయి పల్లవి తెలిపింది. సినిమా అన్నాక గ్లామర్ లేకుండా ఎలా అని పెదవి విరిచిన వారు సైతం ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది. 

ఈ క్రమంలో ఆమె బడా చిత్రాలని సైతం రిజెక్ట్ చేసిందని టాక్. ఇటీవల కాలంలోనే సాయిపల్లవి సినిమాలు రిజెక్ట్ చేయడం ద్వారా దాదాపు 5 కోట్లకు పైగా నస్టపోయినట్లు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో మొదట హీరోయిన్ గా సాయి పల్లవికే ఆఫర్ వచ్చిందట. కానీ తన పాత్ర నచ్చక వదులుకుంది. 

అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పన్ కోషియం రీమేక్, బెల్లంకొండ శ్రీనివాస్ కాదన్ రీమేక్ లని కూడా రిజెక్ట్ చేసింది. సాయిపల్లవి రెమ్యునరేషన్ రూ.80 లక్షల పైనే ఉంటుంది. ఈ లెక్కన ఆమె రిజెక్ట్ చేసిన చిత్రాలని బట్టి సాయి పల్లవి దాదాపు రూ 5 కోట్లవరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. పలు కమర్షియల్ యాడ్స్ ని కూడా సాయిపల్లవి వదులుకుంది. 

ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలలో నటిస్తోంది.

More News

కర్ఫ్యూ, బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌ కారణంగా ఏపీలో పలువురు మరణిస్తున్నారు.

బిల్‌గేట్స్ దంపతులు విడిపోవడానికి ఆ మహిళే కారణమట..

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ విడాకుల వ్యవహారానికి సంబంధించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది.

అనుష్కపై స్టార్ హీరో క్రష్.. ఆమెకు ఫిదా అంటూ కామెంట్స్ 

సౌత్ లో అనుష్క లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో

కరోనాతో కోలీవుడ్ నటుడు నితీశ్ వీరా మృతి

కరోనా మహమ్మారి కారణంగా ఎంతమంది ప్రజలు మృత్యువాత పడుతున్నారో తెలియనిది కాదు.

ఈ లక్షణాలున్నాయా? అయితే కరోనాగా అనుమానించాల్సిందే..

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్‌తో పాటు దాని లక్షణాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.