అల్లు అర్జున్ కోసం... రూ.5కోట్ల సెట్!
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ ఎక్కడా తగ్గడం లేదు. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` తర్వాత ఆయన చేస్తున్న సినిమా `అల వైకుంఠపురంలో...` . ఈ సినిమా కోసం ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవచ్చో, అన్నీ తీసుకుంటున్నాడు. ఎంతగా ఎదగొచ్చో అంతగానూ ఎదగాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన తాజా సినిమాకు సెట్ వేస్తున్నారు. అదీ రూ.5కోట్లతో. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో ఈ సినిమాకు సంబంధించిన సెట్ పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య వరకూ హైదరాబాద్లో మేజర్ షెడ్యూల్ చేశారు.
ఆ షెడ్యూల్ జరుగుతున్న సమయంలోనే సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను, టైటిల్ను ప్రకటించారు. దాన్నిబట్టి సినిమాలో హీరోయిన్ పేరు అలకనంద అని తెలిసింది. ఇప్పుడు వేస్తున్న సెట్ కూడా హీరోయిన్ ఇంటిదేనని టాక్. అంత భారీగా ఉండే సెట్లో హీరోతో పాటు బొమన్ ఇరాని, టబు, పూజా హెగ్డే తదితరులు పాల్గొంటారని తెలిసింది. వచ్చే నెల వరకు యూనిట్ షెడ్యూల్ గ్యాప్లో ఉంటుంది. వచ్చే నెల్లో మరో కీలకమైన షెడ్యూల్ ఉంటుంది. దాంతో టాకీ పార్ట్ చాలా వరకు పూర్తవుతుందని తెలిసింది.
ఇప్పుడు వేస్తున్న హౌస్ సెట్లోనే ఓ పాటను కూడా తీయాలనుకుంటున్నారట.త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. గీతా ఆర్స్ట్ కూడా నిర్మిస్తోంది. అల్లు అరవింద్, చినబాబు నిర్మాతలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.