మంత్రి రాసలీలల సీడీ.. రూ.5 కోట్లకు డీల్.. అసలా మహిళెక్కడ?

  • IndiaGlitz, [Saturday,March 06 2021]

కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వ్యవహారం మిస్టరీగా మారింది. ఒకవైపు సదరు ఆరోపణలు చేసిన మహిళ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నేటికీ ఆమె జాడ తెలియరాలేదు. అయితే ఆమె కనిపించకుండా పోవడం వెనుక ఓ ప్రముఖ నేత హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీడీ వెనుక రూ. 5కోట్ల  ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని మాజీ సీఎం కుమారస్వామి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మైసూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలుత సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఇంకా తన వద్ద సీడీలు ఉన్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్‌మెయిల్‌ కనిపిస్తోందన్నారు.

ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని కుమారస్వామి పేర్కొన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపించి బ్లాక్‌మెయుల్‌ చేశారని తెలిపారు. దీని వెనుక బడా నేతల హస్తముందని ఆయన చెబుతున్నారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. సదరు సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో దేవేగౌడ, ఎస్‌ఎం కృష్ణ కాలం నుంచి ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని, ప్రజా జీవితంలో వారిని అనుమానంతో చూసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు.

మరోవైపు రమేష్ జార్కిహోళి సోదరుడు బాలచంద్ర జర్కిహోళి కథనం మరోలా ఉంది. తన సోదరుడిని కావాలని ఈ కుట్రలో ఇరికించారని... దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బాలచంద్ర డిమాండ్ చేస్తున్నారు. అది ఫేక్ వీడియో అనేది ఆయన వాదన. దానిని విడుదల చేసినవారిపై రూ.100 కోట్లు పురువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. సామాజిక కార్యకర్త, నాగరిక హక్కు పోరాట సమితి దినేష్ కలహళ్లి ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. రమేష్ జర్కిహోళి రాసలీలలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన ఆ సీడీలను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

More News

స్టార్ మా లో నయనతార కొత్త వేషం !

ఆదివారాలు పాజ్ బటన్ తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం . కానీ మరపురానిదిగా మలుచుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. స్టార్ మా ఆదివారాలు

నలుగురిని ప్రేమించిన యువతి.. లక్కీ డ్రాతో వరుడి ఎంపిక!

నలుగురిని సెలక్ట్ చెయ్.. ముగ్గురిని ట్రై చెయ్.. ఇద్దరిని లవ్ చెయ్.. ఒకరిని పెళ్లి చేసుకో.. అన్నట్టుంటుంది యూత్.

‘ఆచార్య‌’ను పూర్తి చేసిన చెర్రీ..!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య‌’. సినిమాను మే 13న విడుద‌ల చేయ‌బోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

‘శ్రీకారం’ ట్రైలర్: వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన శర్వా

శర్వానంద్ సినిమాలంటేనే కుటుంబం మొత్తం హ్యాపీగా చూడగలిగేలా ఉంటాయని టాక్ ఉంది. అద్భుతమైన కథలను ఎంచుకోవడంలో శర్వాకు శర్వాయే సాటి.

'ఇష్క్' ఫ‌స్ట్ జోల్ట్‌ విడుద‌ల‌

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామంతో మ‌ళ్లీ తెలుగులో వ‌రుస‌గా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసింది.