అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు రావడం బాధాకరం!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బోన్ క్యాన్సర్‌ బాధపడుతున్నారని రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. అయితే ఈ వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక అభిమానులు, కార్యకర్తలు, మంత్రులు, బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన చెందారు. తీరా చూస్తే.. అదంతా అబద్ధమేనని తాను ట్వీట్ చేసిన కాదన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నమ్మకండని షా క్లారిటీ ఇచ్చారు. గత రెండు రోజులుగా కోట్లాది మంది పార్టీ కార్యకర్తలు, శ్రేయాభిలాషులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. దీంతో తాను స్పందించి క్లారిటీ ఇవ్వాలని అనుకున్నట్లు రియాక్ట్ అయ్యారు. తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నానని.. ఏ వ్యాధితోనూ బాధపడట్లేదని షా తెలిపారు.

పవన్ స్పందన..

ఈ వ్యవహారంపై జనసేన అధినేత, బీజేపీ మిత్రుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. నిజంగా అమిత్ షాపై ఇలాంటి పుకార్లు రావడం బాధాకరమన్నారు. షాపై ప్రచారంలో ఉన్న పుకార్లలో నిజంలేదని స్పష్టం చేశారు. కాగా పవన్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇదివరకే షా ఆరోగ్యంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత షా కూడా స్వయంగా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.