Vijay Antony : షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్ ఆంటోనీ ఆరోగ్యంపై వదంతులు, భయాందోళనల్లో ఫ్యాన్స్

  • IndiaGlitz, [Thursday,January 19 2023]

సాధారణ సౌండ్ ఇంజనీర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోనీ (Vijay Antony) .. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా తన విలక్షణ నటనతో భారతదేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. నకిలీ, డాక్టర్, సలీం చిత్రాలతో తనలోని నటుడిని బయటకు తీసిన విజయ్ ఆంటోనీకి.. బిచ్చగాడు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ బిచ్చగాడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాతి నుంచి విజయ్ ఆంటోనీ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూడటం మొదలుపెట్టారు.

సిబ్బంది బోటును ఢీకొట్టిన విజయ్ పడవ:

ఇదిలావుండగా.. కొద్దిరోజుల క్రితం విజయ్ ఆంటోనీ తన కొత్త చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బిచ్చగాడు 2 సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. విజయ్ ప్రయాణిస్తున్న బోట్ పక్కనే వున్న క్రూ సిబ్బంది పడవని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటన తర్వాత విజయ్‌ని మలేషియా నుంచి చెన్నైకి తీసుకొచ్చినట్లుగా కోలీవుడ్ మీడియా తెలిపింది.

చెన్నైలో విజయ్ ఆంటోనీకి చికిత్స :

ప్రస్తుతం విజయ్ ఆంటోనీకి చికిత్స జరుగుతుండటంతో ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను విజయ్ ఆంటోనీ సన్నిహితులు కొట్టిపారేశారు. ప్రమాదంలో ఆయనకు స్వల్పగాయాలు మాత్రమే తగిలాయని, విజయ్ ఇప్పటికే కోలుకున్నారని తెలిపారు. ఇకపోతే.. బిచ్చగాడు 2ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. బిచ్చగాడుకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై దక్షిణాదిలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు.

More News

Popcorn:‘పాప్ కార్న్’ మూవీ నుంచి ‘మది విహంగమయ్యే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన నాగ చైతన్య

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో

Mukarram Jah : ముకరం జా మరణం.. ముగిసిన నిజాంల ఘన వారసత్వం

హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం ముకరం జా కన్నుమూయడంతో అసఫ్ జాహీ రాజ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Raghunandan Rao:4 వేల కోట్ల ల్యాండ్ స్కాంలో తోట చంద్రశేఖర్.. భూ దందా కోసమే బీఆర్ఎస్‌లోకి : రఘునందన్ రావు వ్యాఖ్యలు

ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన జనసేన నేత తోట చంద్రశేఖర్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amala Paul:గుడిలోకి అడుగుపెట్టనివ్వని పూజారులు.. అమలాపాల్‌కు ఘోర అవమానం, వివక్ష పోలేదంటూ హీరోయిన్ ఆవేదన

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నా.. ఇంకా దేశంలో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి.

Bandi Sanjay:తోటి విద్యార్ధిపై దాడి, ముదురుతోన్న బండి సంజయ్ కుమారుడి వివాదం.. వెలుగులోకి మరో వీడియో

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తోటి విద్యార్ధిని కొట్టిన వీడియో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.