'సాహో' బిజినెస్‌.. టాలీవుడ్ టాక్‌

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైన‌ర్ 'సాహో'. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేష్ విలన్ గా న‌టిస్తున్నాడు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

బడ్జెట్ పరంగా (బాహుబలిని మిన‌హాయిస్తే) తెలుగు సినిమాల ప‌రంగా.. ఇప్పటి వరకు ఇదే హై బడ్జెట్ సినిమా కావ‌డం విశేషం. సగం షూటింగ్ పూర్తయ్యేసరికే.. ఈ సినిమా నిర్మాతలకు హై రిటర్న్స్ తెచ్చిపెడుతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. హిందీ, తమిళ్ వెర్షన్లకు ఈ మూవీ థియేటరికల్, శాటిలైట్స్ హక్కులకు గాను యువి క్రియేషన్స్ కి రూ. 210 కోట్ల ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి రూ.200 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్లు నిర్మాతలు వెల్లడిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణాలో రూ. 90 నుంచి 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్ నాటకీయకంగా పెరగకపోతే తప్ప.. ఈ సినిమాపై నిర్మాతలు మంచి లాభాన్ని ఆశించవచ్చు. అలాగే కొంత రిస్క్ కూడా ఉంది. అదేమిటంటే.. సినిమా షూటింగ్ ఆలస్యం జరిగిందంటే 'బాహుబలి' క్రేజ్ అంత పోయే ప్రమాదం కూడా ఉంది. అది కొంత ప్రీ-రిలీజ్ బడ్జెట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేక పోలేదు. ఇలా 'సాహో' సినిమా ఎంత లాభాలతో ఊరిస్తుందో, అంతే రిస్క్ ని కూడా హెచ్చరిస్తుంది.

More News

మోహన్ బాబు 'గాయత్రీ' షూటింగ్ లో విష్ణు మంచు, శ్రియ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రీ’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది.

జవాన్ ప్రీ రిలీజ్ టూర్ వివరాలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సప్తగిరి ఎల్ ఎల్ బి' పెద్ద హిట్ అవుతుంది - రామ్ చరణ్

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్బి'.

భారత్ వరల్డ్ రికార్డ్స్ లో గణేష్ మాస్టర్

ఢీ-2 టెలివిజన్ డాన్స్ షో విన్నర్, మా టీవీ అవార్డ్ గ్రహీత, భారత్ ఆర్ట్స్ అకాడెమీ ద్వారా గబ్బర్ సింగ్ అవార్డును గణేష్  మాస్టరు అందుకొన్నారు.

ఇంకెన్ని స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తాడో

'హలో’ సినిమాతో అఖిల్.. ప్రేక్షకులకు రోజుకొక సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ముందు టీజర్, ట్రైలర్లతో అలరించాడు. తర్వాత త‌ను చేసే పాత్ర అంటూ అవినాష్‌గా ప‌ల‌క‌రించాడు. అమ్మ నాన్న అంటూ రమ్యకృష్ణ, జగపతి బాబులను పరిచయం చేస్తూ ఒక పిక్ ని రిలీజ్ చేసాడు.