'సాహో' షూటింగ్ పూర్తి..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మాణంలో వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం `సాహో`. తెలుగు,తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం బాలీవుడ్, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు సినిమా అత్యుత్తన్నంగా రూపొందిస్తున్నారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.రెండేళ్ల పాటు కొనసాగుతున్న ఈసినిమా చిత్రీకరణ ఎట్టకేలకు పూర్తయ్యింది.
చిత్ర యూనిట్ సెట్లో ప్రభాస్తో దిగిన ఫొటోలను షేర్ చేసుకుంటూ షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేశారు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్తోపాటు నీల్ నితిన్, చంకీ పాండే, జాకీ ష్రాఫ్ తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.