వేలంటైన్స్ డే సందర్భంగా 'సాక్ష్యం' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,February 14 2018]

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సాక్ష్యం' అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకొంటున్న చిత్రబృందం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలో హీరోహీరోయిన్ లుక్స్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ ను విడుదల చేశాం. వారి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. శ్రీవాస్ హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ రాసిన విధానం బాగుంది. ఈ చిత్రంతో ఒక కొత్త శ్రీనివాస్ ను చూస్తారు. ఆయన దర్శకత్వ శైలి పూర్తిగా మారిపోయింది.

'సాక్ష్యం' చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు చాలా కీలకం అందుకే పీటర్ హెయిన్స్ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్ లో చిత్ర కథానాయకుడు బెల్లంకొండ, పూజా హెగ్డేల నడుమ కాంబినేషన్ సీన్స్ తోపాటు.. కీలకపాత్రధారులైన జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం" అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

More News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ 'ఛల్ మోహన్ రంగ' టీజర్

'ఛల్ మోహన్ రంగ''నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం.కథానాయకుడు నితిన్ కు 25వ చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. 

అనిరుధ్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ మిస్‌.. త‌మ‌న్ య‌స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ఈ చిత్రం....ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది. మార్చి 26 నుంచి నిరవధిక చిత్రీకరణ జరుపుకోనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్న వెంకీ, తేజ చిత్రం

కొత్త నటీనటులతో సినిమాలను తెరకెక్కించడం దర్శకుడు తేజకు కెమెరాతో పెట్టిన విద్య.

మహానటుల పాత్రల కోసం 'మహానటి' టెక్నాలజీ

మహానటి సావిత్రి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించనున్న చిత్రం ‘మహానటి’.

'రంగస్థలం' మొదటి పాటకు మంచి స్పందన

యేరు శెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..