Sadhguru:అనారోగ్యం నుంచి కోలుకున్న సద్గురు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..

  • IndiaGlitz, [Wednesday,March 27 2024]

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అభిమానులను శుభవార్త. బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకోవడంతో ఆయనను ఆపోలో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చా్ర్జ్ చేశారు. కాగా కొన్ని రోజులుగా తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్న జగ్గీ వాసుదేవ్ ఇటీవల ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వాసుదేవ్ మెదడులో బ్లీడింగ్, వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం మెల్లగా కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు.

గత నాలుగు వారాలుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు అపోలో ఆస్పత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రాణాంతకమైన పరిస్థితి నెలకొందని.. మెదడులో బ్లీడింగ్, వాపు ఉన్నట్లు సీటీ స్కాన్‌లో వెల్లడైందని చెప్పారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చి సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సద్గురుకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి అయిందని.. ఆయన మెల్లగా కోలుకుంటున్నారని తెలిపారు.

మరోవైపు బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత సద్గురు మాట్లాడుతున్న ఓ వీడియోను ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు విడుదల చేశారు. తనకు ఏం జరగలేదని.. మొదడులో చిన్న వాపు ఉండటంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని మునుపటిలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రార్థనలు చేశారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అయితే ఆయనను ఐసీయూలో బెడ్‌ మీద చూసి దేవుడే కుప్పకూలిపోయినట్లు అనిపించిందని ఎమోషనల్ అయ్యారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నా శివరాత్రి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని.. మీరు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే సద్గురు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా పోస్ట్ చేశారు.

More News

Anasuya:జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ కీలక వ్యాఖ్యలు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నేతల ప్రచారాలు, విమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి.

Vijayamma:ఇడుపులపాయలో జగన్‌తో విజయమ్మ.. కుమారుడికే మద్దతా..?

ఏపీ సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ముందుగా ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు.

Ram Charan:చిరంజీవి కొడుకు నుంచి గ్లోబల్ స్టార్ వరకు.. రామ్‌చరణ్ సినీ ప్రస్థానం..

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్. తన నటన, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న 'గ్యాంగ్‌లీడర్'.

CM Jagan:ఎన్నికల కురుక్షేత్రంలోకి సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర..

ఎన్నికల కురుక్షేత్రంలోకి సీఎం జగన్ దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 'సిద్ధం'

Charan Couple:శ్రీవారిని దర్శించుకున్న చెర్రీ దంపతులు.. క్లీంకార ఫోటో రివీల్..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజును మెగా అభిమానులు గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.