గాయపడిన ఫ్యాన్ కి ఆర్ధిక సహాయం అందించిన సాయి ధరమ్ తేజ్ - దిల్ రాజు

  • IndiaGlitz, [Sunday,November 01 2015]

కొద్ది వారల క్రితం సాయి ధరమ్ తేజ్ - హరీష్ శంకర్ ల 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సక్సెస్ టూర్ జరుగుతుండగా, అనుకోని విధం గా కాకినాడ లో చిన అప్పన్న అనే ఒక ఫ్యాన్ గాయపడ్డాడు. ఈ ఘటన పై ఆ రోజున హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకులు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు విచారం వ్యక్తం చేసి, గాయపడిన అప్పన్న చికిత్సకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని తెలిపారు.

చెప్పిన విధం గా నే ఈ రోజు దిల్ రాజు కార్యాలయం లో అప్పన్న కుటుంబ సభ్యులకు హీరో సాయి ధరమ్ తేజ్ 50 వేలు, నిర్మాత దిల్ రాజు 50 వేలు అందించారు. మొత్తం లక్ష రూపాయలు అందుకున్న కుటుంబ సభ్యులను, అప్పన్న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దర్శకులు హరీష్ శంకర్ కూడా అప్పన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్టార్స్ ని కలుసుకునే సమయం లో, ఆడియో ఫంక్షన్స్ మరియు సక్సెస్ టూర్స్ వంటి కార్యక్రమాల్లో ఫాన్స్ జాగ్రత్త గా ఉండాలని హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భం గా విజ్ఞప్తి చేసారు.

More News

అల్లు అర్జున్ చేతుల మీదుగా 'కుమారి 21 ఎఫ్' ఆడియో రిలీజ్

విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21ఎఫ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్,హీబా పటేల్ జంటగా నటించారు.సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

'షేర్‌' సినిమా బాక్సాఫీస్‌ వసూళ్లలో దూసుకుపోతున్నందుకు ఆనందంగా ఉంది: నిర్మాత కొమర వెంకటేష్‌

డేరింగ్‌ స్టార్‌ నందమూరి కళ్యాణ్‌రామ్‌ - సోనాల్‌ చౌహాన్‌ జంటగా మల్లిఖార్జున్‌.ఎ దర్శకత్వంలో విజయలక్ష్మి పిక్చర్స్‌ పతాకంపై కొమర వెంకటేష్‌ నిర్మించిన చిత్రం 'షేర్‌'. తమన్‌ ఎస్‌.ఎస్‌ సంగీతం అందించారు.

మరో భారీ చిత్రంలో అనుష్క

సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...అరుంథతి, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో...ఇలా విభిన్నకథా చిత్రాల్లో నటిస్తూ..స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న అందాల తార అనుష్క.

శంక‌రాభ‌ర‌ణం కి సెంటిమెంట్ క‌లిసొస్తుందా..

తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో మ‌ర‌చిపోలేని సంచ‌ల‌న‌ చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ సంచ‌ల‌న సినిమాని క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ తెర‌కెక్కించారు.

సంక్రాంతి రేసులో వ‌రుణ్ తేజ్

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మా అమ్మ మ‌హాల‌క్ష్మి. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.