సుప్రీమ్ సెన్సార్ పూర్తి మే 5 విడుదల

  • IndiaGlitz, [Friday,April 29 2016]

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది.

సుప్రీమ్ మే 5 న భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తో సాయి ధరమ్ తేజ్ చేస్తోన్న మూడవ చిత్రం ఇది.

"సుప్రీమ్ అందరినీ అలరించే ఒక మాస్ ఎంటర్టైనర్.వేసవి సెలవుల్లో కుటుంబ సమేతం గా చూసి ఎంజాయ్ చేసే చిత్రం. మే 5 న భారీ విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదల చేసిన ఆడియో కు మంచి స్పందన వస్తోంది . సాయి కార్తీక్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి ", అని శిరీష్ అన్నారు.

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ చిత్రం ఇది. ఏక్షన్ , కామెడీ ,రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళలో ఉండే చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది", అన్నారు.

సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

దర్శకత్వం - స్క్రీన్ప్లే - అనిల్ రావిపూడి. రచనా సహకారం - ఎస్ . కృష్ణ. ఫైట్స్ - వెంకట్ . సినిమాటోగ్రఫీ - సాయి శ్రీరామ్ . ఆర్ట్ - ఏ .ఎస్ ప్రకాష్ - ఎడిటర్ - ఎమ్ అర్ వర్మ . సంగీతం - సాయి కార్తీక్ . నిర్మాత - శిరీష్ . సమర్పకులు - దిల్ రాజు

More News

మొన్న ప‌వ‌న్ - నిన్న మ‌హేష్

మొన్న ప‌వ‌న్ - నిన్న మ‌హేష్...ఇంత‌కీ విష‌యం ఏమిటంటే....ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో రూపొందిన తొలి చిత్రం ఖుషీ. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఖుషీ త‌ర్వాత ప‌వ‌న్ - సూర్య క‌ల‌సి పులి సినిమా చేసారు.

ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో చిరంజీవి 150వ చిత్రం ప్రారంభం..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కుటుంబ స‌భ్యులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో  ఈరోజు ప్రారంభ‌మైంది.  ఈ చిత్రానికి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

స‌రైనోడు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రానికి ఫ‌స్ట్ మిశ్ర‌మ స్పంద‌న ల‌భించిన‌ప్ప‌టికీ...మాస్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

'బ్రహ్మోత్సవం' నైజాం హక్కులను దక్కించుకున్న..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'బ్రహ్మోత్సవం'.

'ఒక్కమనసు' పై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత...

నిహారిక,నాగశౌర్య జంటగా మధుర శ్రీధర్,టీవీ9 సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఒక్క మనసు.