close
Choose your channels

ఈ ఏడాది నాలుగు చిత్రాలతో సాయిధరమ్..

Wednesday, February 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2014లో పిల్లా నువ్వు లేని జీవితం`తో క‌థానాయ‌కుడిగా పరిచయమ‌య్యాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. 2015లో రేయ్`, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` .. ఇలా రెండు చిత్రాలు చేసిన సాయిధ‌ర‌మ్‌, 2016లో సుప్రీమ్`, తిక్క`తో మరోసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో పిల్లా నువ్వు లేని జీవితం`, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్`, సుప్రీమ్` విజయాలను అందించగా.. మిగిలిన రెండు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక గత ఏడాది సాయి నుంచి మూడు చిత్రాలు (విన్నర్`, నక్షత్రం`, జవాన్`) వ‌చ్చాయి. అయితే ఇవేవీ తేజుకు ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయాయి.

ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఇంటిలిజెంట్` తన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ప్రస్తుతం.. యూత్‌ఫుల్‌ డైరెక్టర్ కరుణాకరన్‌తో ఒక సినిమా చేస్తున్న‌ తేజు.. గోపీచంద్ మలినేనితో సినిమాని కూడా లైన్లో పెట్టేసాడు. అంతేగాకుండా.. నేను శైలజ`, ఉన్నది ఒకటే జిందగీ` వంటి చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి ఈ కథ కిషోర్.. నాని కోసం రాసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నాని తప్పుకోవడంతో.. ఈ కథను తేజు టేకాప్ చేసారని ఇండస్ట్రీ టాక్. గోపీచంద్ మలినేని చిత్రంతో పాటు.. కిషోర్ తిరుమల మూవీ కూడా మే నుంచి సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. అంటే.. అన్నీ కుదిరితే ఈ ఏడాది సాయిధ‌ర‌మ్ నాలుగు చిత్రాల‌తో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌.
మొత్తానికి.. ప్రతీ ఏడాది తన సినిమాల సంఖ్యను పెంచుకుంటున్న ఈ యువ కథానాయకుడు.. వీటితో పాటు విజయాలను కూడా పెంచుకుంటే బాగుంటుందని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.