జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్‌-కరుణాకరన్‌ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ జరుగుతోంది. జూన్‌ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్‌' వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్‌ ఐ లవ్‌ యు' రూపొందుతోంది.

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

More News

ఏదైనా ఒక‌టి సంక్రాంతికే అంటున్న‌ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తమిళ రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన రవితేజ

విజయ్, సమంత జంటగా నటించిన తమిళ  చిత్రం 'తెరి'. 2016లో వచ్చిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో కూడా 'పోలీస్‌' పేరుతో అనువదించారు.

'సమ్మోహనం' కోసం 74 ఏళ్ళ వయసులో ఫుల్ రొమాంటిక్ సాంగ్ రాసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 

సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది.

జూన్ 1న 'వైఫ్ ఆఫ్ రామ్' ట్రైలర్

కెరియ‌ర్ బిగినింగ్ నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ను సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి ఈసారి ధీక్ష గా ప్రేక్ష‌కుల‌కు స‌ర్ ప్రైజ్ చేయ‌బోతుంది.

32 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నాగ్‌

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు అక్కినేని నాగార్జున. 'గీతాంజలి' లాంటి లవ్ స్టోరీస్ గాని.. 'శివ' లాంటి యాక్షన్ మూవీస్ గాని..