మరో సినిమాను కూడా లైన్లో పెడుతున్న తేజు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరు ప్లాప్స్ తర్వాత సాయిధరమ్ తేజ్కి దక్కిన హిట్ `చిత్రలహరి`. కూల్ హిట్ తర్వాత సాయితేజ్ వెంట వెంటనే సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. కాస్త గ్యాప్ తీసుకున్న సాయితేజ్ త్వరలోనే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు..దీని తర్వాత మరో సినిమాను కూడా సాయితేజ్ లైన్లో పెట్టుకుంటున్నాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం సాయితేజ్ తదుపరి సినిమాను దేవా కట్టా డైరెక్షన్లో చేయబోతున్నాడట.
దేవా కట్టా ప్రస్తుతం `బాహుబలి` ప్రీక్వెల్గా రూపొందుతున్న వెబ్ సిరీస్ `శివగామి`ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాతే సాయితేజ్తో దేవాకట్టా సినిమా ఉంటుంది. సోషల్ డ్రామా నేపథ్యంలో దేవాకట్టా సినిమా ఉంటుందంటున్నారు. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య చిత్రాల దర్శకుడు దేవాకట్టా ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.