ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను : మెగా ఫ్యామిలీ ప్రేమపై సాయి తేజ్ భావోద్వేగం

  • IndiaGlitz, [Saturday,November 06 2021]

రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన పూర్తిగా కోలుకున్నారని సాయి తేజ్ మేనమామ, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దీపావళి పండుగ నాడు సాయిధరమ్ తేజ్‌తో దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి పూర్తిగా కోలుకున్నాడు... మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండగ’ అని చిరు అన్నారు. ఈ గ్రూప్ ఫొటోలో మెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌, వైష్ణవ్‌ తేజ్‌, అకీరా సందడి చేశాడు. ఆ వెంటనే ‘నా పునర్జన్మకు కారణమైన మీ ప్రేమకు, ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం’ అంటూ సాయి ట్వీట్‌ చేశారు.

కాగా వినాయక చవితి సందర్భంగా సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్ దుర్గంచెరువు వద్ద వున్న కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు. అనంతరం తొలుత 108 ద్వారా మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

More News

జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి గాయం.. సర్జరీ, ఏమైందంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌కు త్వరలో శస్త్రచికిత్స జరగనుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాత్ర కోసం

బిగ్‌బాస్ 5 తెలుగు: తగ్గేదేలే అన్న యానీ మాస్టర్, పింకీ.. సిరి ఏడుపుపై పింకీ సెటైర్లు, మానస్ ఫైర్

బిగ్‌బాస్ 5 తెలుగు హౌస్ మరోసారి రణరంగమైంది. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రియాంకను అవతలి టీమ్ వాళ్లు ముప్పు తిప్పలు పెట్టారు.

హీరో రాజ‌శేఖ‌ర్‌ ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి వరదరాజన్ గోపాలన్ కన్నుమూత

దీపావళి పండుగ వేళ సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.

కె. విశ్వనాథ్ ఇంటికి చిరంజీవి దంపతులు.. ఆశీస్సులు తీసుకున్న మెగాస్టార్

దీపావళి పర్వదినం సెలబ్రిటీలు ఉత్సాహంగా గడుపుతున్నారు. తమ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు, సాంగ్స్, ప్రోమోలు, ట్రైలర్లు,

దీపావళి నాడు స్పెషల్ సర్‌ప్రైజ్.. ముగ్గురు హీరోయిన్ల గుట్టు విప్పిన నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘ శ్యామ్ సింగ రాయ్ ’’ సినిమా మీద టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.