close
Choose your channels

ఫోర్బ్స్ ఇండియా 30లో సాయిపల్లవి..

Thursday, February 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫోర్బ్స్ ఇండియా 30లో సాయిపల్లవి..

30 ఏళ్ల లోపు ఉన్న ఇండియన్ యూత్‌లో అత్యధిక సంపాదన కలిగిన 30 మంది జాబితాను ఇటీవలే ఫోర్బ్స్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, సైన్స్, మీడియా, డిజైన్, ఫ్యాషన్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వివిధ రంగాల్లో రాణించిన వారు ఉన్నారు. అయితే ఈ జాబితాలో యూ ట్యూబర్స్‌కు కూడా చోటు దక్కింది. అయితే.. ఇదే జాబితాలో ‘ప్రేమమ్’ సినిమాతో యూత్‌ను ఆకర్షించి.. అందర్నీ ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి కూడా చోటు దక్కించుకుంది.

టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, మల్లూవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాలు సెలెక్టెడ్‌గా చేసి తక్కువ సినిమాలు చేసినా కూడా ఎక్కువ పారితోషికం మాత్రం గట్టిగానే పుచ్చుకుంటోందట. ఏడాదిలో ఈ అమ్మడి ఆదాయం దాదాపుగా 30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అందుకే సాయిపల్లవి పోర్బ్స్ జాబితాలో చేరింది. కాగా.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రానా, నాగచైతన్యతో నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.