close
Choose your channels

'మ‌హాస‌ముద్రం'లో సాయిప‌ల్ల‌వి

Sunday, April 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హాస‌ముద్రంలో సాయిప‌ల్ల‌వి

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా ప‌లువురు హీరోల‌ను క‌లిశాడు. అంతా ఓకే అవుతున్న త‌రుణంలో ప్రాజెక్ట్ ఆగుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు శ‌ర్వానంద్ హీరోగా సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్ వినపడుతుంది. శర్వానంద్ జతగా సమంత నటిస్తుందని ఆ మ‌ధ్య వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే స‌మంత ప‌క్కకు త‌ప్పుకుంది. దీంతో సాయిప‌ల్ల‌వికి అజ‌య్ భూప‌తి క‌థ‌ను వినిపించాడ‌ట‌. ఆమె వైపు నుండి గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సి ఉంది.

కాగా ఇప్పుడు రానాతో విరాట‌ప‌ర్వం సినిమాలో న‌టిస్తోన్న సాయిప‌ల్ల‌వి త‌దుప‌రి కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్‌తో క‌లిసి న‌టించ‌బోతుంది. వీరిద్ద‌రు ఇది వ‌రకే ప‌డి ప‌డి లేచె మ‌న‌సు సినిమాలోనూ న‌టించారు. ఇప్పుడు అజ‌య్ భూప‌తి సినిమాకు ఓకే చెబితే శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో రాబోయే మూడో సినిమా ఇదే అవుతుంది. ప్ర‌స్తుతం శ్రీకారం సినిమా చేస్తున్న శ‌ర్వా త‌దుప‌రి కిశోర్ తిరుమ‌ల సినిమాను పూర్తి చేసిన త‌ర్వాతే ‘మ‌హాసముద్రం’లో న‌టించే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.