4 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న సాయిపల్లవి ‘కోలు కోలు’

  • IndiaGlitz, [Tuesday,March 02 2021]

సాయి పల్లవి పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిండే’ అంటూ యూత్‌ని గతంలో కిర్రెక్కించిన సాయి పల్లవి తాజాగా మరో పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సారి ‘‘కోలు కోలమ్మా.. కోలో కోలో.. నా సామి.. మనసే మేలుకుని చూసే.. కలలో నిండిన వాడే..’ అంటూ తన ప్రియుడి కోసం పాడిన విషయం తెలిసిందే. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా ‘విరాట పర్వం’ సినిమా తెరకెక్కింది.

ప్రస్తుతం ఈ ‘కోలు కోలు’ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకు పోతోంది. ఈ పాటకు 4 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టు ‘విరాటపర్వం’ చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. రానా నక్సలైట్‌గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. మరోవైపు ‘కోలు కోలు’ సాంగ్‌కి షార్ట్ వీడియోస్ చేసి పంపి మీ ప్రేమను చాటుకోవాలంటూ ప్రేక్షకులను చిత్ర యూనిట్ కోరుతోంది. దీనికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

అయితే ఈ ‘కోలు కోలు’ పాటకు చంద్రబోస్ చక్కటి సాహిత్యాన్ని అందించారు. ప్రతి లైన్ చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను హీరో వెంకటేష్ గత గురువారం విడుదల చేశారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

‘A’ రాపిడ్ ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’.

పవన్‌ను కలిసిన ఆషు.. నాలుగో పెళ్లికి సైతం సిద్ధమేనట..

‘బిగ్‌బాస్’ ఫేమ్‌లు వరుసగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలుస్తున్నారు.

పెట్రోల్ బాంబు మంటల్లో గాయపడిన ప్రముఖ హీరో

ప్రముఖ హీరో షూటింగ్‌లో గాయపడిన ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఓ సన్నివేశం చిత్రీకరణలో

'ఏ1 ఎక్స్‌ప్రెస్'ను నిజానికి 40 రోజుల్లో తీశాం: సందీప్ కిషన్

హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. డెన్నిస్‌ జీవన్‌  కనుకొలను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.

చేతిలో బీర్ బాటిల్‌తో డ్రైవింగ్.. నలుగురి మృతి

మద్యం మత్తులో కారు నడిపి నలుగురి చావుకు కారణమయ్యాడో వ్యక్తి. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం అమ్మవారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.